Babar Azam : భారీ అంచనాలతో ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్లోకి అడుగుపెట్టిన భారత్ సెమీస్కి చేరకుండానే ఇంటి దారి పట్టింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ 2023 లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం మీడియాతో మాట్లాడాడు. లీగ్ స్టేజ్ లో 9 మ్యాచ్ లలో కేవలం నాలుగు గెలిచి, ఐదింట్లో ఓడిన పాక్ టీమ్.. సెమీస్ చేరకుండానే ఇంటికెళ్లిపోయింది. అయితే ఇండియన్ ఫ్యాన్స్ తమను బాగా చూసుకున్నారని, చాలా మద్దతిచ్చారని బాబర్ చెప్పాడు. ఇంగ్లండ్తో ఒడిన తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీ ప్రమాదంలో పడటంతోపాటు ఆ టీమ్ పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబర్ ఇండియాలో లభించిన ఆతిథ్యంతోపాటు తన బ్యాటింగ్ వైఫల్యం, తొలిసారి ఇండియాలో అడుగుపెట్టిన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చాడు.
ఇండియా నుంచి తమకు చాలా మద్దతు, ప్రేమ లభించాయి. నేను సరిగా టోర్నీని ముగించలేకపోయాను. బ్యాటింగ్ లో రాణించడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను. 50 లేదా 100 కొట్టాలని అనుకోలేదు. టీమ్ ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నా వ్యక్తిగత ప్రదర్శన కాదు.. జట్టు విజయానికి సాయం చేసే ప్రదర్శన చేయాలనుకున్నాను. పరిస్థితులను బట్టి నేను నెమ్మదిగా ఆడాను. వేగంగా ఆడాను. టీమ్ అవసరాలను బట్టే ఆడాను” అని బాబర్ తెలిపాడు.ఇక్కడెలా ఆడాలో అవగాహన లేదు. కానీ సాధ్యమైనంత త్వరగా పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రయత్నించాం. ఇక్కడెలా బ్యాటింగ్ చేయాలన్నదానిపై ఓ ప్లాన్ రూపొందించుకున్నాం.
మొదట్లో, చివర్లో పరుగులు వస్తాయి. మధ్యలో బంతి పాతబడిన తర్వాత బ్యాటర్లకు కాస్త కష్టమవుతుంది” అని బాబర్ అన్నాడు. ఇక ఈ వరల్డ్ కప్లో ఎవరు విజేత అనే దానిపై కూడా సమాధానం ఇచ్చాడు. ఇండియా లేదా ఆస్ట్రేలియాలలో ఒక జట్టు తప్పక ట్రోఫీ అందుకుంటుందని జోస్యం చెప్పాడు బాబర్. ఇక వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ సెమీఫైనల్ కూడా చేరకపోవడంతో ఆ టీమ్ పై, కెప్టెన్ బాబర్ ఆజంపై మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అతని కెప్టెన్సీ కూడా తీసేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే షాహిన్ ఆఫ్రిది, బాబర్ మధ్య విభేదాలు నెలకొన్నాయంటూ ప్రచారం నడుస్తుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…