Baahubali 2 : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన చిత్రం బాహుబలి. రెండు పార్ట్లుగా తెరకెక్కిన ఈ చిత్రం అనేక సంచలనాలు క్రియేట్ చేసింది. ప్రభాస్ ద్విపాత్రాభినయం, రానా, అనుష్క మరియు తమన్నా ముఖ్య పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా ప్రపంచ వ్యాప్తంగా సునామీ సృష్టించాయి.ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారగా, రాజమౌళి మోస్ట్ పాపులర్ డైరెక్టర్ అయ్యాడు. కలెక్షన్ ల పరంగా అదరగొట్టిన ఈ సినిమాపై బాహుబలి పార్ట్ – 3 కూడా రానుందని కొన్ని సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాధేశ్యామ్ ప్రమోషన్ లలో భాగంగా ప్రభాస్ స్పందిస్తూ.. “బాహుబలి పార్ట్-3 గురించి నాకు కూడా ఎలాంటి వార్త లేదు.. కానీ టైం వస్తే జరగొచ్చు” అని హింట్ ఇచ్ఛేసరికి ఈ సినిమా తప్పక ఉంటుందని అందరు అనుకున్నారు. రాజమౌళి కూడా పలు సందర్భాలలో బాహుబలి 3పై ఇన్డైరెక్ట్గా ప్రస్తావించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ బాహుబలి పార్ట్ 3 కూడా ఉంటుందని , కాకపోతే ఇంకా సమయం పడుతుందని చెప్పారు. తాజాగా మరోసారి బాహుబలి 3 గురించి చర్చ నడుస్తుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మూవీ మారథాన్ జరుగుతుండగా, ఈ ఈవెంట్ లో రాజమౌళి సినిమాలను కూడా ప్రదర్శిస్తున్నారు.
ఈ క్రమంలో రాజమౌళికి క్యూ అండ్ ఏ లో పాల్గొన్నారట. అప్పుడు బాహుబలి 3కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒకే ఒక సినిమా క్లైమాక్స్ ను ఓపెన్ ఎండ్ గా సంభాషణను పెట్టినట్టు చెప్పారు. అలా బాహుబలి సినిమాలో క్లైమాక్స్ లోనే తనికెళ్ల భరణి మరియు చిన్నారి మధ్య జరగగా, అప్పుడు స్వామీజీ వేషంలో ఉన్న తనికెళ్ల భరణితో చిన్నారి మహేంద్ర బాహుబలి కొడుకు రాజు అయ్యాడు తాతా అని అడుగుతుంది. దానికి తనికెళ్లభరణి.. ఏమో శివయ్య మనసులో ఏమనుకుంటాడో నాకేటి ఎరుక.. అంటూ సమాధానం ఇస్తాడు. అంటే దీనిని బట్టి రాజమౌళి అప్పుడే బాహుబలి 3పై హింట్ ఇచ్చాడ అని చర్చ మొదలు పెట్టారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…