Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి తన క్రేజ్ ని మరింత పెంచుకుంది.ముందుగా టిక్ టాక్ వంటీ యాప్ల్లో షార్ట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయిన అషు రెడ్డి… ఆ తరువాత నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి.. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గోని మరింత క్రేజ్ సంపాదించింది. బిగ్ బాస్ షోతోనే కాకుండా బిగ్ బాస ఓటీటీలోను సందడి చేసి తెగ పాపులారిటీ తెచ్చుకుంది అషూ రెడ్డి. ఇక ఈ అమ్మడు రామ్ గోపాల్ వర్మతో నానా రచ్చ చేసి మంచి క్రేజ్ అందిపుచ్చుకుంది. అయితే ఇప్పుడు అషూ పేరు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఈ అమ్మడి పేరు హాట్ టాపిక్గా మారింది.
ఇటీవల కబాలి నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. అతనితో టచ్లో ఉన్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారిలో టాలీవుడ్ నటి అషురెడ్డి కూడా ఉంది. ఇప్పుడు అషురెడ్డి కొన్ని సమస్యల్లో పడింది. అషురెడ్డి మొబైల్ నంబర్ లీక్ కావడంతో ఆమెకు రోజూ వేలల్లో కాల్స్ వస్తున్నాయి. దీంతో అషూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. తన ఫోన్ నెంబర్కి సెకనుకొక కాల్ వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘డ్రగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా పరువు తీస్తున్నారు. కొందరు కావాలనే వార్తలు ప్రచురించారు.
వారిపై పరువు నష్టం కేసు పెడతాను. నా ఫోన్ నెంబర్ బయటకు లీక్ చేశారు. దీంతో నాకు సెకనుకు ఒక కాల్ వస్తోంది. ఈ మొబైల్ నంబర్ వాడటం మానేశాను.’ అంటూ అషురెడ్డి మొబైల్కి వచ్చిన కాల్స్ చూపించింది. అంతకు ముందు కూడా ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా విషయాన్ని తెలియజేసింది. ‘కొందరు మీడియా ప్రతినిధులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల కొంతమంది వ్యక్తులతో నాకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. అదంతా అబద్ధం. అవసరం వచ్చినప్పుడు నేనే విషయాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియజేస్తాను. నా మొబైల్ నంబర్ను వెల్లడించడం సహించబోను.’ అని అషురెడ్డి తెలిపింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…