Arshdeep Singh : టీ 20 మ్యాచ్‌లో 5 నో బాల్స్ వేసిన అర్ష్‌దీప్ సింగ్.. నెట్టింట తెగ ట్రోల్స్..

Arshdeep Singh : ప్ర‌స్తుతం ఇండియా, శ్రీలంక మ‌ధ్య టీ20 సిరీస్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. తొలి టీ 20 లో ఇండియా విజ‌యం సాధించ‌గా, రెండో టీ20లో శ్రీలంక 16 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ ఓడిపోవ‌డానికి ముఖ్య కార‌ణం అర్ష్‌దీప్ సింగ్ అని చెప్పాలి. ఆసియా క‌ప్‌లో మంచి క్యాచ్ చేజార్చి ఇండియా ఓడిపోయేలా చేసి విమ‌ర్శ‌ల‌పాలైన అర్ష్‌దీప్ సింగ్ గ‌త రాత్రి మ్యాచ్‌లో మొత్తం 5 నోబాల్స్ వేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. శ్రీలంకపై బౌలింగ్ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్‌… తన మొదటి ఓవర్ లోనే ఏకంగా హ్యాట్రిక్ నో బాల్స్ ఇచ్చి ప్రత్యర్థి జట్టుకు ఆ ఒక్క ఓవర్లోనే మొత్తం 19 పరుగులు సమర్పించుకున్నాడు.

ఒకే ఓవర్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా నిలిచిన అర్ష్‌దీప్ సింగ్, రెండో ఓవర్‌లో మరో రెండు నో బాల్స్ వేశాడు. మొత్తంగా 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్, 5 నో బాల్స్ వేసి.. టీమిండియా తరుపున ఒకే మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు… 2 ఓవర్లలో 37 పరుగులు సమర్పించిన అర్ష్‌దీప్ సింగ్, 2 ఓవర్లు బౌలింగ్‌ చేసి అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా మూడో స్థానంలో నిల‌వ‌డం విశేషం. ఇంతకుముందు అశ్విన్ 2 ఓవర్లలో 41 పరుగులు ఇవ్వగా రవీంద్ర జడేజా 38 పరుగులు ఇచ్చాడు.. ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనే ఈ ఫీట్లు సాధించారు.

Arshdeep Singh trolled by netizen for his no balls
Arshdeep Singh

2022లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అర్ష్‌దీప్ సింగ్, ఒకే ఏడాదిలో 12 నో బాల్స్ వేశాడు. 2022 జనవరి నుంచి ఏడాది కాలంలో భారత మిగిలిన బౌలర్లు అందరూ కలిసి 11 నో బాల్స్ వేస్తే, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే 12 నో బాల్స్ వేశాడు. అయితే ప్రాక్టీస్ లేకపోవడం వల్లే అర్ష్‌దీప్ సింగ్ ఇలా బౌలింగ్ చేశాడని దినేశ్ కార్తీక్ కామెంట్ చేశాడు .. ‘అర్ష్‌దీప్ సింగ్ జ్వరంతో ప్రాక్టీస్‌కి దూరంగా ఉండ‌గా, జ్వరం నుంచి కోలుకుని నేరుగా మ్యాచ్‌లో బరిలో దిగడంతో రిథ‌మ్ అందుకోలేక‌పోయాడు. ఒక్క మ్యాచ్‌ కారణంగా అర్ష్‌దీప్ సింగ్ టాలెంట్‌ని తక్కువ అంచనా వేయకూడదు…’ అంటూ భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ అత‌నికి సపోర్ట్‌గా నిలిచాడు.అయితే అర్ష్‌దీప్ సింగ్‌ హ్యాట్రిక్ నోబాల్ వేసినప్పటి నుంచే అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయింది. ఇక శ్రీలంకపై టీమిండియా ఓటమిపాలవడంతో ఆ ఆగ్రహంతో ఉన్న అభిమానులు మరీ ఎక్కువ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago