Ramya Raghupathi : గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో నరేష్- పవిత్ర- రమ్యరఘుపతి వ్యవహారం తెగ హాట్ టాపిక్ అవుతుంది. మూడో భార్య అయిన రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చిన నరేష్.. పవిత్రతో సహజీవనం చేస్తుండడమే కాదు ఆమెని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డిసెంబర్ 31వ తేదీన నరేష్ , పవిత్ర లిప్ కిస్ చేసుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 2023 కి కొత్తగా స్వాగతం పలుకుతున్నామంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే ఇప్పటివరకు వివాహం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఈ జంట ఏకంగా వివాహం చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించడంతో అనేక చర్చలు జరిగాయి.
నరేష్ తన మూడవ భార్య రమ్యకు కోట్లలో భరణం ఇచ్చి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్ని విషయాలు క్లియర్ అయిపోవడంతో నరేష్ పవిత్ర వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సాగగా, తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మొట్టమొదటిసారిగా తెలుగు మీడియా ముందుకు వచ్చారు. నరేష్ పవిత్ర లిప్ లాక్ వీడియో మీద మీరు చాలా కంగారు పడుతున్నారని తెలిసిందని యాంకర్ పేర్కొనగా ఇది మీకు కొత్త ఏమో కానీ నాకు కొత్త కాదని రమ్య రఘుపతి చెప్పింది. తాను నరేష్ మీద ఆరోపణలు చేశానని దానికి తగిన సాక్ష్యాలు కూడా తాను కన్నడ మీడియా ముందు పెట్టానని ఆమె పేర్కొన్నారు.
దేవుడి లాంటి కృష్ణగారితో తనకు అక్రమ సంబంధం ఉందని నరేశ్ ఆరోపించినట్లు రమ్య తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. కానీ కృష్ణగారి ఇంటి ప్రతిష్ట, మర్యాదలను దృష్టిలో పెట్టుకుని ఇన్నాళ్లూ ఈ నిజాన్ని చెప్పలేదన్నారు. కానీ రోజురోజుకు నరేశ్ దారుణాలు పెరిగిపోతున్నాయని.. అందుకే ఈ నిజం చెప్పాల్సి వచ్చిందని రమ్య అన్నారు. నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు నరేశ్ చేయని పనులు లేవు. చివరికి కృష్ణగారి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. నాకు ఇంజంక్షన్ సూట్ పంపారు. అందులో నా నుంచి కృష్ణగారికి ప్రాణహాని ఉందని రాశారు. ఈ విషయాన్ని కృష్ణగారి దృష్టికి తీసుకువెళ్లమని మా కుటుంబ సభ్యులు చాలా మంది చెప్పారు. కానీ నరేశ్ చేసే పనుల వల్ల ఆయన గౌరవం దెబ్బతినకూడదని నేను.. కృష్ణగారితో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇలాంటి దారుణాలు చేసి.. నా నుంచి విడాకులు తీసుకోవాలని నరేశ్ ఎంతో ట్రై చేస్తున్నాడు. కానీ నేను విడాకులు ఇవ్వను. కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. అన్నీ కోర్టులోనే తేల్చుకుంటాను అని రమ్య చెప్పుకొచ్చింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…