Annapurnamma : సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర ప్రధాన పాత్రలలో మళ్లీ పెళ్లి అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. సీనియర్ నటుడు వీకే నరేష్ సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తాను నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఆయన తల్లి విజయనిర్మల స్థాపించిన విజయ కృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమాని మే 26న విడుదల చేశారు. ఇందులో పవిత్రా లోకేష్ ఆయనకు జంటగా నటించారు. వనితా విజయకుమార్ కీలక పాత్ర పోషించారు. జయసుధ అతిథి పాత్రలో నటించారు. తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ చిత్రాన్ని విడుదల చేశారు. చిత్ర రిలీజ్కి ముందు హైదరాబాద్లో ‘మళ్ళీ పెళ్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న అన్నపూర్ణమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది. నాకు ఎం.ఎస్.రాజుగారు కథ చెప్పారు. ఇక ఎవరు ఏమనుకున్నా ఈ సినిమాను అందరూ తప్పకుండా చూస్తారు. సొసైటీ లో 90 ఏళ్ళు అయినా పెండ్లి చేసుకుంటున్న సందర్భాలున్నాయి. దానికి కారణం ఒంటరితనం భరించలేక పలకరింపు కోసమే అలా చేసుకుంటున్నారు. ఇప్పుడు యంగర్ జనరేష్ కొంత కాలం కలిసి వుండి ఆ తర్వాత పెండ్లి చేసుకుంటున్నారు. ఫైనల్ గా ఎప్పుడైనా మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిందే అని అన్నారు. ఒకవైపు వారి గురించి పాజిటివ్గా మాట్లాడుతూనే మరోవైపు అన్నపూర్ణమ్మ చురకలు అంటించింది.
ఇక ఈ ఈవెంట్లో జయసుధ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్షిప్పై వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడుతూ.. మన ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయం కన్నా పక్కింట్లో ఏం జరుగుతుందనే ఆసక్తే చాలా మందిలో ఉంటాయని జయసుధ చెప్పుకొచ్చారు. ఇక నరేష్ మాట్లాడుతూ.. రీల్ లైఫ్ బాగున్నా రియల్ లైప్ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ తర్వాత ఇంకో అమ్మను కలుసుకున్నా. పెండ్లి లో నమ్మకం, ఆప్యాయత, తోడును కోరుకుంటాం. వృద్ధాప్యంలో బలాన్ని కోరుకుంటాం. అందుకే చివరికి నా గమ్యానికి చేరుకున్నానని చెప్పగలను అని నరేష్ అన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…