Anjanamma : సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. చిరంజీవి అనే నట వృక్షం నుండి ఎంతో మంది హీరోలు సినీ పరిశ్రమకు పరిచయం కాగా, వారిలో అందరు హీరోలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తోపాటు వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందారు. వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులలో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది.
అయితే చిరంజీవి తల్లి అంజనమ్మకి మెగా హీరోల సినిమాల కన్నా కూడా అక్కినేని సినిమాలంటే ఎక్కువగా ఇష్టపడతారట. అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో ప్రేమ కథా చిత్రాలలో నటించి లేడీ ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. అలా అంజనాదేవి కూడా అక్కినేనికి పెద్ద ఫ్యాన్ అట. తనకు ఊహ తెలిసిన నాటి నుండి అక్కినేని నటనని చాలా ఇష్టపడేదట. ఇక చిరంజీవి ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకునే సినిమాల్లోకి వచ్చారు. స్వయంకృషితో మెగాస్టార్గా ఎదిగారు.
చిరు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వచ్చారు. ఈ ఫ్యామిలీ నుండి ఎంత మంది హీరోలు వచ్చినా కూడా వారు సక్సెస్ అవుతుండడం విశేషం. ఇక అమ్మ అంటే చిరంజీవికి చాలా ఇష్టం. ఇప్పటికీ ఎంత బిజీగా ఉన్నా కూడా కచ్చితంగా అమ్మతో చాలా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. తన సినిమాలను కూడా తల్లితో కలిసి చూస్తుంటారు మెగాస్టార్. ఇక పవన్ కూడా తన తల్లిని ఎంతో ఇష్టపడుతుంటారు. ఆంధ్రప్రదేశ్లో మరణించిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు లక్ష రూపాయలని విరాళంగా జనసేన పార్టీ అధినేత పవన్కి అందించిన విషయం తెలిసిందే.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…