Anil Kumar Yadav : ఏపీ అసెంబ్లీలో టీడీపీ నాయకులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సభ ప్రారంభంకాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా.. టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని.. సైకో పాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అంబటి రాంబాబు మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ అంశంపై చర్చ జరుగుతుందని.. అందులో టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు.. అయినా టీడీపీ సభ్యులు నిరసన కొనసాగించారు.
సభలో బాలయ్య తీరుపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ ఊదారని.. సీటు ఎక్కి ఎందుకు ఆ సీట్లో కూర్చోమంటూ బాలయ్యకు చురకలు అంటించారు. తండ్రిని చంపిన చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం ఇలా స్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత బాలయ్య ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందే అన్నారు. బాబు కళ్లలో ఆనందం చూసేందుకే బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు సీటుపై కాదు… చంద్రబాబుపై ఎక్కి కూర్చోవాలని అంబటి రాంబాబు కోరారు. టీడీపీ సభ్యులు ఇలానే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 23 సీట్లు దక్కవన్నారు. సింగిల్ డిజిట్ మాత్రమే దక్కుతుందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
ఇక అనీల్ కుమార్ యాదవ్ కూడా టీడీపీ నాయకుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సిగ్గు శరం లేదా అంటూ మండిపడ్డారు. రాజదాని గురించి మాట్లాడే సమయం ఆ రోజు మాకు ఇవ్వలేదు. ఈ రోజు గంటన్నర మాట్లాడే అవకాశం ఇస్తే వారికి సరిపోవడం లేదు. దొంగ నాటకాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.సిగ్గు, శరం వీళ్లకి ఉంటే ఈ పాటికి ఖాళీ చేసి అన్నా వెళతారు. లేకపోతే గమ్మున ఉంటారు. ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రజల కోసం వారు ఆలోచించడం లేదు అని అనీల్ మండిపడ్డారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…