Anchor Shyamala : యాంకర్ శ్యామల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా, యాంకర్గా, బిగ్ బాస్ కంటెస్టెంట్గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. కొంత సంప్రదాయబద్ధంగా ఉంటూ అందరి మన్ననలు పొందుతుంది. అనసూయ, రష్మీ, శ్రీముఖి తరహాలో శ్యామల అతిగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేయదు. నటుడు నరసింహారెడ్డిని శ్యామల వివాహం చేసుకున్న తర్వాత ఆనయతో సంతోషంగావైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. శ్యామల కెరీర్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వెళుతోంది. అయితే ఇప్పుడు ఈమెకి సంబంధించిన ఓ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఎప్పటికప్పుడు శ్యామల తన పర్సనల్ విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది జూలైలోనే శ్యామల కొత్త ఇల్లు కట్టుకుంది. అప్పుడు ఆ ఇంటికి సంబంధించిన విశేషాలను వీడియో, ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం విదితమే. అప్పుడు నెటిజన్స్ అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. కట్ చేస్తే ఇప్పుడు మరో ఇంటికి భూమి పూజ చేస్తున్నానని చెప్పటంతో కొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. మొన్నే కదా విలాసవంతమైన ఇంట్లోకి మారారు. ఇప్పుడు మరో ఇల్లా.. శ్యామల ఫ్యామిలీ కి డబ్బు ఎలా వస్తోంది.. ఆ సీక్రెట్ కొంచెం చెప్పండి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
2021లో శ్యామల, నరసింహ దంపతులు విలాసవంతమైన ఇంటిని కట్టుకోగా, ఆ ఇంటి గృహప్రవేశానికి సంబందించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ వేడుకకి రాజీవ్ కనకాల, కమెడియన్ అలీ లాంటి వారు కూడా హాజరయ్యారు. శ్యామల ఇలా భూమి పూజ విషయంతో వార్తలలోకి ఎక్కడం ఆమె అభిమానులని కూడా కొంత ఆశ్చర్యపరుస్తుంది. అసలు పెద్దగా షోలు కూడా చేయని శ్యామలకి అంత డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయా అని ఆశ్చర్యపోతున్నారు.
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…