Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఈ అమ్మడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ ఏదో ఒక కామెంట్ చేస్తుంటుంది.ఈ క్రమంలో వారు కూడా అనసూయని ట్రోల్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఆ మధ్య ఈ పదానికి వ్యతిరేకంగా అనసూయ పెద్ద యుద్ధమే చేసింది. లైగర్ మూవీ మీద అనసూయ చేసిన పరోక్ష కామెంట్ చాలా వివాదాస్పదంగా మారింది. అమ్మను తిట్టిన పాపం ఇలా వెంటాడింది. అందుకే లైగర్ ప్లాప్ అనే అర్థంలో అనసూయ ట్వీట్ చేశారు. అనసూయ చర్యతో ఆగ్రహానికి గురైన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై ట్రోలింగ్ షురూ చేశారు. ఆంటీ అనే ట్యాగ్ ట్రెండ్ చేశారు.
ఆంటీ అని పిలవడం కూడా వేధింపుల క్రిందికి వస్తుంది. నేను కేసు పడతా అంటూ అనసూయ హెచ్చరించారు. అయినా కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తగ్గలేదు. దాదాపు మూడు రోజులు అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అనసూయ కొందరి మీద సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేశారు. అంతకు ముందు కూడా అనసూయను ఆంటీ అంటూ కవ్వించేవారు. ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లున్నారని, అందుకే ఆమె ఆంటీ అంటూ ఎద్దేవా చేసేవారు. అసలు ఆంటీ అంటే తనకు కోపం ఎందుకో వివరణ కూడా ఇచ్చింది అనసూయ.
ఆంటీ అని పిలిస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వారి పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుంది. అయితే ఈ మధ్య నాకు కోపం రావడం లేదు. ఈ ట్రోలర్స్ ని చక్కదిద్దడం కంటే ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి అంటూ అనసూయ సమాధానం చెప్పింది. అయితే ఇటీవల జరిగిన విమానం మూవీ సక్సెస్ మీట్లో చైల్డ్ ఆర్టిస్ట్ అనసూయని ఆంటీ అని పిలిచింది. దీంతో అతడిని దగ్గరకి పిలిచి కిస్ ఇచ్చింది అనసూయ. నా పిల్లల కన్నా వీడు చిన్నవాడు. వాడు పిలుపులో ఎలాంటి అర్దాలు ఉండవు అంటూ ఆ బుడ్డోడితో సరదాగా మాట్లాడింది అనసూయ.
అనసూయ కామెంట్ వైరల్ అవుతుంది. అనసూయ మిగతా సెలెబ్రెటీలకు భిన్నం. ఆమె ట్రోలర్స్ ని అసలు సహించరు. హద్దు దాటి కామెంట్స్ చేస్తే ఫైర్ అవుతారు. చట్టపరమైన చర్యలకు వెనుకాడరు. ఆమె కంప్లైంట్స్ తో జైలుపాలైన వాళ్ళు చాలానే ఉన్నారు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…