Anand Deverakonda : విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో సాయి రాజేష్ తెరకెక్కించిన చిత్రం బేబి. హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆనంద్ దేవరకొండ నటించిన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు ఊహించని రీతిలో రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రం నిర్మాతలపై కోట్ల వర్షం కురిపిస్తోంది. చిత్రంలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటించగా విరాజ్ అశ్విన్ మరో ప్రధాన పాత్రలో నటించారు. నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ నిర్మించారు.
యూత్కు కనెక్ట్ అయ్యే కథాంశంతో వచ్చిన ‘బేబిస చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.71 కోట్లు షేర్, రూ. 66.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.క్లిష్టమైన ప్రేమకథతో వచ్చిన ‘బేబి’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం లేడి ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఇందులో ఒక యువతి ఆనంద్ని ప్రశ్నిస్తూ.. వైష్ణవి ఏం చేసిన ఫైనల్గా మీకు దగ్గరకు వచ్చిన ఎందుకు రిజెక్ట్ చేశారని అడగగా, దానికి ఆనంద్ స్పందిస్తూ నాలో ఉన్న మంచితనం హీరోయిజం లేవు అని అన్నాడు. అంత లగ్జరీ లైఫ్ వదిలేసి మీకోసం వచ్చింది కదా యాక్సెప్ట్ చేస్తే బాగుండేది అని అనడంతో ఆనంద్ .. నాకు పాపం అనిపించలేదు అని అంటాడు. క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులని ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…