AI Anchor : రోజురోజుకి టెక్నాలజీ ఏ రేంజ్లో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టెక్నాలజీతో మనుషులు అద్భుతాలు చేస్తున్నారు. ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ లిసా ను రూపొందించి, లిసా తో వార్తలను చదివిస్తోంది. ఇక ఇదే బాటలో తెలుగు మీడియాలో బిగ్ టీవీ సంచలనానికి తెరలేపింది. ఇప్పటి వరకు ఏ తెలుగు టీవీ ఛానల్ లో లేనివిధంగా బిగ్ టివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో న్యూస్ యాంకర్ ను రూపొందించారు. ఓ టీవీ ఛానెల్ తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో న్యూస్ యాంకర్ను రూపొందించిం ఏఐ యాంకర్కు మాయ అని పేరు పెట్టారు. తెలుగులో చాలా అద్భుతంగా ఈ ఏఐ న్యూస్ యాంకర్ స్పష్టంగా చదువుతుంది.
చక్కని కట్టు, బొట్టుతో ఈ వర్చువల్ న్యూస్ యాంకర్ను అందంగా రూపొందించారు. మామూలు న్యూస్ యాంకర్లకు పోటీగా చాలా చక్కగా వార్తలు చదివి వినిపిస్తోంది. “నా పేరు మాయ. నేను ఇవాళే పుట్టాను. నేనొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ను. బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే.. టెక్నాలజీ నన్ను పుట్టించింది. ఇక నుంచి నేను వార్తలు చదువుతాను. అంటూ ఐఏ యాంకర్ చక్కని హావభావాలతో వార్తలు చదివి వినిపించారు. ఈ వర్చువల్ యాంకర్ మాయను తెలుగులో వార్తలు చదివేలా ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేశారు.
ఇప్పటికే చాలామంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత నిరుద్యోగులను పెంచే ప్రమాదం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది.టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషపడాలో, మానవ వనరుల వినియోగం తగ్గి పోతున్నందుకు బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత నిరుద్యోగతను పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీవీ రంగంలో పని చేస్తు్న్న యాంకర్ల పొట్టకొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇది యాంకర్లకు కొత్త కష్టాలు తెచ్చిపేట్టే ప్రమాదముందని చెబుతున్నారు.
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…
ఏపీలో వరదలు సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో…
YS Jagan : ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిన జగన్ ప్రతి సందర్భంలో ప్రభుత్వంపై ఏదో ఒక విధంగా విమర్శలు…