Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఎదిగి టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు. ఆయన చిత్రాలు బాక్సాఫీస్ని ఎంతగా షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ని షేక్ చేశాయి. అయితే చిరు నటించిన చిత్రాలలో స్టేట్ రౌడీ చిత్రం కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో దూసకుపోయింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలో రాధా, భానుప్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా బి. గోపాల్ సినిమాకి దర్శకత్వం వహించాడు.
మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్ బ్యానర్ పై డి సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి బప్పి లహరి సంగీతం అందించారు. ముందు ఈసినిమాకి కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కిన కూడా చివరకు బీ గోపాల్కి అవకాశం దక్కింది. 1989 మార్చి 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా నైజాంలో కోటి రూపాయల కలెక్షన్లు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ చూసి అమితాబ్ షాక్ అయ్యాడట.
ట్రేడ్ గైడ్ అనే బాలీవుడ్ మాక్సిన్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా కలెక్షన్ల వివరాలను ప్రచురించి చిరంజీవి సినిమా కలెక్షన్లతో పోలిస్తే అమితాబ్ సినిమాను వేర్ ఇస్ అమితాబ్ అని ప్రశ్నిస్తూ ఆర్టికల్ రాసింది. దీంతో చిరంజీవి పేరు బాలీవుడ్ లోను మోరుమ్రోగిపోయింది. సక్సెస్ ఫుల్ గా వంద రోజులు చేసుకొని చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా ఈ చిత్రం నిలవగా, వంద రోజుల వేడకుని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సక్సెస్ మూడ్లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆచార్యతో నిరాశ చెందిన చిరు ఇప్పుడు గాడ్ ఫాదర్తో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…