Ambati Rambabu : ఏపీ మంత్రి అంబటి రాంబాబు నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటారు. జగన్పై, అలానే వైసీపీ ప్రభుత్వంపై ఎవరైన ఆరోపణలు చేస్తే వారికి ధీటుగా బదులిస్తుంటాడు అంబటి. అయితే అంబటి రాంబాబు గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాపై చిర్రుబుర్రులాడారు. విమానం దిగి వస్తున్న ఆయనను మీడియా పలకరిస్తూ.. గుడ్ ఈవెనింగ్ సర్ అంటూ విష్ చేశారు. ‘ఏమీ లేదబ్బా విషయం’ అంటూ అంబటి కారెక్కి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనను పోలవరం, తదితర అంశాలపై ప్రశ్నలు అడిగేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మంత్రి అంబటి భద్రతా సిబ్బంది తమను తోసివేశారని రిపోర్టర్లు ఆరోపించారు. ఏంటయ్యా ఏంటీ అంటూ అంబటి కాస్తంత కోపంగా అడిగారు. ‘తోసేస్తున్నారు సర్’ అంటూ రిపోర్టర్లు అంబటికి తెలిపారు.
దాంతో అంబటి స్పందిస్తూ… ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుంది… వాళ్ల పని వాళ్లు చేశారు, మీ డ్యూటీ మీరు చేసుకోండి అంటూ మీడియాపై అసహనం ప్రదర్శించారు. మా డ్యూటీ కోసమే వచ్చాం సర్ అంటూ మీడియా ప్రతినిధులు బదులివ్వగా, కాస్త స్వరం పెంచిన మంత్రి అంబటి… వాదన ఎందుకు? అంటూ ప్రశ్నించారు. చివరికి మీడియా ప్రశ్నలకు సమాధానమివ్వకుండానే అక్కడ నుండి జారుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరుపై కొందరు జర్నలిస్ట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతకముందు తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు వెళ్లిన ఆయన ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. తిరుమల కొండపైన తాను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడనని అన్నారు. స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు మంత్రికి టిటిడి అధికారులు ఆలయం అర్చకులు దగ్గరుండి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…