Walking : ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులు, బిజీ జీవనశైలి కారణంగా మనలో చాలామందికి ఎక్సర్ సైజ్ చేయటానికి అసలు సమయమే చిక్కటం లేదు. దాంతో స్థూలకాయం, బీపీ, షుగర్, గుండె పోటు, ఒత్తిడి ఇలా ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. ఈ సమస్యల నుండి బయట పడటానికి ఎక్సర్ సైజ్ చేసే సమయమే లేనివారు కేవలం 30 నిమిషాలు నడిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేస్తే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రతి రోజు 30 నిమిషాల పాటు నడిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. తద్వారా గుండె నొప్పి, ఇతర గుండె జబ్బులు రాకుండా ఉండటమే కాకుండా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. రక్తపోటు ఉన్నవారిలో రక్త నాళాల్లో రక్త ప్రవాహనికి సరిపోయే ఆక్సిజన్ సప్లై అయ్యి కండరాలు మరింత రిలాక్స్ గా అయ్యి బ్లడ్ ప్రెజర్ ను అదుపులోకి తెస్తుంది.
వాకింగ్ చేయడం వల్ల కీళ్లు దృఢంగా ఉండి కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు తగ్గి చాలా చురుకుగా మారతారు. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాయామం చేస్తేనే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది. అయితే వ్యాయామం అంటే జిమ్లో గంటల తరబడి కసరత్తులు చేయాల్సిన పనిలేదు. రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే చాలు. ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కనుక రోజూ వాకింగ్ చేయాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…