ఎప్పుడు సంతోషంగా ఉంటూ నలుగురితో ఎంతో అన్యోన్యంగా ఉండే తారకరత్న ఎవరు ఊహించని విధంగా ఫిబ్రవరి 18న కన్నుమూసారు. అతని మరణం భార్య పిల్లలకి చాలా బాధకు గురి చేసింది. ఇక తారకరత్న మరణించిన తర్వాత అతనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటిసారి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. ఏప్రిల్ 22వ తేదీన తారకరత్న పుట్టినరోజు కావడంతో అలేఖ్య తన ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
ప్రతి పుట్టినరోజు కుటుంబ సభ్యులతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న తారకరత్న ఇప్పుడు వారి మధ్య లేకపోవడంతో తట్టుకోలేకపోయిన అలేఖ్య రెడ్డి మొదటిసారి తారకరత్నకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేస్తూ తన ప్రేమను షేర్ చేసుకుంది. హ్యాపీ బర్త్ డే బెస్ట్ ఫాదర్.. బెస్ట్ హస్బెండ్.. అలాగే ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. లవ్ యు సో మచ్.. అంటూ అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా తన కూతురితో ఉన్న ఫోటోను కూడా ఆమె అందులో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలేఖ్య రెడ్డి, తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్న భార్యను ఎంత ఓదార్చినా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది అలేఖ్య రెడ్డి. ఆమెతో పాటు తారకరత్న పిల్లలు కన్నీరు కూడా మున్నీరయ్యారు. ఇక గతంలో తారక రత్న తన బర్త్ డేని తాను ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే బాబాయ్ బాలకృష్ణతో జరుపుకున్నారు. ఆ ఫొటోస్ ని నందమూరి అభిమానులు వైరల్ చేసారు. ఏదేమైన మంచి మనిషి చిన్న వయస్సులోనే ఇలా ఆకస్మాత్తుగా కన్నుమూయడం ఎవరికి మింగుడుపడడం లేదు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…