37 Years Back Restaurant Bill : ఈ రోజుల్లో చాలా మంది ఇంటి తిండి కన్నా రెస్టారెంట్ తిండికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రేట్లు చాలా ఉన్నా కూడా అందులో తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకొందరు అయితే ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని లాగించేస్తున్నారు. వేలకు వేలు బిల్లులు అవుతాయని ఆలోచించినా, కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తినేసి వస్తున్నారు. అయితే డిల్లీలోని లజపత్ నగర్ లో ఉన్న లజీజ్ రెస్టారెంట్ &హోటల్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును షేర్ చేయగా, అది చూసిన ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. వాస్తవానికి 2013 ఆగస్టు 12న ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు మళ్లీ వైరల్గా మారింది.
ఢిల్లీలోని లజ్పత్ నగర్ ప్రాంతంలో ఉన్న లాజీజ్ రెస్టారెంట్ & హోటల్ డిసెంబర్ 20, 1985 నాటి బిల్లును షేర్ చేసింది. బిల్లులో చూపిన విధంగా కస్టమర్ ఒక ప్లేట్ షాహీ పనీర్, దాల్ మఖ్నీ, రైతా, కొన్ని చపాతీలను ఆర్డర్ చేశారు. వస్తువుల ధర మొదటి రెండు వంటకాలకు రూ.8, మిగిలిన రెండింటికి వరుసగా రూ.5, రూ. 6 గా ధర ఫిక్స్ చేశారు. అయితే వాటి బిల్లు మొత్తం రూ.26 కావడం గమనార్హం. ఇది నేటి కాలంలో ఒక చిప్స్ ప్యాకెట్ ధరకు సమానం అని చెప్పాలి. ఇక ఈ బిల్లు షేర్ చేసినప్పటి నుండి ఈ పోస్ట్కి 1,800 లైక్లు, 587 షేర్లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఇదే విషయాన్ని చూసి అవాక్కయ్యారు.
ఒక వినియోగదారు, “OMG… అది చాలా చౌకగా ఉండేది… అవును అయితే ఆ రోజుల్లో డబ్బు విలువ చాలా ఎక్కువ….” అని కొందరు కామెంట్ చేశారు. ఈ బిల్లు చూస్తే కొందరికి నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. ” ఆ రోజులు చాలా బాగుండేవి,1968లో 20 లీటర్ల పెట్రోలుకు 20 రూపాయలు, పది పైసలు టైర్లలో గాలి కోసం ఖర్చుచేసేవాణ్ణి. ఆ బంకు ఇప్పటికీ వుంది, ఆంధ్ర మహిళా సభకు ఎదురుగా అనీ, 1972లో ఎస్పీఎస్ లో పని చేసేవాడినని, తన జీతం 550 రూపాయలని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ పాత బిల్లును దాచుకొని షేర్ చేసినందుకు ధన్యవాదాలు అని కామెంట్ చేశాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…