Actress Lakshmi : కొంత మంది స్టార్స్ మన జీవితంలో ఎప్పటికీ అలా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి అతి తక్కువ మంది నటిమణుల్లో లక్ష్మీ కూడా ఉన్నారు. ఆమె అసలు పేరు యార్రగుడిపాడి వెంకట మహాలక్ష్మి. 1968 లో నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె సుమారు 400 సినిమాలలో నటించిన మెప్పించింది. తెలుగులో మురారి సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఓ బేబి సినిమాల్లో కూడా ఆమె నటించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లక్ష్మీ 1952, డిసెంబరు 13 న చెన్నైలో జన్మించింది. ఈమె మొదటి చిత్రం 1968 లో విడుదలైన తమిళ సినిమా “జీవనాంశమ్”.
ఇక 1970లలో లక్ష్మీ ఇండస్ట్రీలో బిజీ అయ్యింది. అప్పట్లో 1975లో విడుదలైన జూలీ మూవీలో నటించి తన సత్తా చాటుకుంది లక్ష్మీ. ఈ మూవీలో లక్ష్మి నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కడం విశేషం. ఇక అక్కడ నుండి లక్ష్మీకి ఇండస్ట్రీలో ఎదురు లేకుండా పోయింది. ఈమె తల్లి తండ్రిది కూడా సినిమా నేపధ్యం కావడంతో ఆమెకి అవకాశాలకి కొదవ లేకుండా పోయింది. జీన్స్ సినిమాలో ఐశ్వర్య మనసు పడ్డ అబ్బాయితో పెళ్లి చేయడానికి.. బామ్మ పాటలో లక్ష్మీ జీవించేసింది. ఇక మురారిలో అయితే.. మహేశ్ బాబు వదినగా ఈమె నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.
రీల్ లైఫ్ లో ఎంతో సాధించినా.. రియల్ లైఫ్ లో మాత్రం లక్ష్మీకి ఇబ్బందులు తప్పలేదు. లక్ష్మీకి మూడుసార్లు పెళ్లి జరిగింది. పదిహేడేళ్ళపుడు పెద్దలు కుదిర్చిన సంబంధము ద్వారా భాస్కర్ ను మనువాడింది. ఈ వివాహ బంధానికి గుర్తుగా 1971 లో కుమార్తె ఐశ్వర్య జన్మించింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత తన సహనటుడు మోహన్ ను పెళ్ళి చేసుకుంది. ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. . తర్వాత నటుడు, దర్శకుడు అయిన శివచంద్రన్ ని పెళ్ళాడింది లక్ష్మీ. ఇక కన్నడ ఆర్టిస్ట్ అనంత్ నాగ్ తో కూడా ఈమె కొన్నాళ్ళు సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి.అయితే ముగ్గురు భర్తల విషయంలో ఆమె ఎక్కువగా శివచంద్రన్ అనే వ్యక్తితోనే సంతోషంగా ఉన్నానంటూ ఎన్నోసార్లు చెప్పింది. ఆమెని డామినేట్ చేసే భర్త వల్లనే విడాకులు ఇచ్చినట్టు తెలుస్తుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…