కార్తీక మాసంలో సహజంగానే చాలా మంది శివున్ని పూజిస్తారు. ఇక కొందరు విష్ణువుకు పూజలు చేస్తారు. అయితే ఇద్దరిలో ఎవరికైనా సరే కార్తీక మాపసం ప్రీతికరమే. శివుడు అయితే అభిషేక ప్రియుడు. కనుక ఆయనకు అభిషేకాలు చేస్తే సంతోషించి మనకు ఆశీస్సులు అందిస్తాడు. అదే విష్ణువు అయితే అలంకార ప్రియుడు. కనుక ఆయనను వివిధ రకాల పూలతో అలంకరించాలి. దీంతో మనల్ని అనుగ్రహించి మనం కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు. అయితే కార్తీక మాసంలో ఈ ఇద్దరినీ కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలతో పూజిస్తే భిన్న రకాల ఫలితాలను పొందవచ్చు. ఇక ఈ ఇద్దరికీ ఏయే రకాల ద్రవ్యాలతో పూజలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీకమాసంలో శివకేశవులను ఆవు నెయ్యితో పూజిస్తే ధనం లభిస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. ఆవుపాలతో పూజిస్తే అన్ని సుఖాలే కలుగుతాయి. కష్టాలు పోతాయి. శుద్ధమైన నీటితో పూజలు చేస్తే ఏ పని చేసినా నష్టం అనేది రాకుండా ఉంటుంది. అలాగే భస్మాభిషేకం చేస్తే మహా పాపాలు కూడా హరించుకుపోతాయి. గంధోదకంతో పూజిస్తే సంతానం కలుగుతుంది.
సువర్ణోదకంతో పూజలు చేస్తే దరిద్రం పోతుంది. తేనెతో అయితే తేజస్సు, యశస్సు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కొబ్బరినీళ్లతో పూజలు చేస్తే సకల సంపదలు కలుగుతాయి. పుష్పాలతో పూజలు చేస్తే భూమి గొడవలు పరిష్కారం అవుతాయి. కొత్తగా భూమిని కొనుగోలు చేస్తారు. భూలాభం కలుగుతుంది. చక్కెరతో పూజలు చేస్తే దుఃఖం అనేది ఉండదు. మారేడు పత్రాలతో పూజ చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి.
చెరుకు రసంతో పూజలు చేస్తే ధనం సంపాదిస్తారు. నువ్వుల నూనెతో అయితే అపమృత్యుదోష నివారణ జరుగుతుంది. శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్నాభిషేకం చేస్తే అధికార ప్రాప్తి జరుగుతుంది. పసుపు, కుంకుమలతో పూజలు చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. చేసే ఏ పనిలో అయినా సరే తప్పక విజయం సాధిస్తారు. ఇలా కార్తీక మాసంలో శివుడు, విష్ణువులను పూజిస్తే భిన్న రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…