ఏపీలో ఇంటర్మీడియట్కు గాను సప్లిమెంటరీ పరీక్షల హాట్ టిక్కెట్లను ఇటీవలే విడుదల చేశారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ సబ్జెక్టులను చదివే విద్యార్థులు ఏపీకి చెందిన ఇంటర్ బోర్డు అధికారిక సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే విద్యార్థులు తమ పాత హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ కార్డు నంబర్తోపాటు పుట్టిన తేదీ వివరాలను లేదా పేరును నమోదు చేయాలి. దీంతో హాల్ టికెట్ను ఇస్తారు. ఇక ఏపీలో ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1456 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2,41,591 మంది అంటే.. 54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించారు. అలాగే సెకండ్ ఇయర్లో 2,58,449 అంటే.. 61 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. ఇక పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నారు.
ఆగస్టు 3 నుంచి 12 వరకు ఏపీలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ లో పరీక్షలు జరుగుతాయి. ఇక ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో భాగంగా ఆగస్టు 3న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది. 4వ తేదీన ఇంగ్లిష్, 5న మ్యాథ్స్ పేపర్-1ఎ, సివిక్స్, బోటనీ, ఆగస్టు 6న మ్యాథ్స్-1బి, హిస్టరీ, జువాలజీ పరీక్షలను నిర్వహిస్తారు.
ఇక ఆగస్టు 8న ఫిజిక్స్, ఎకనావిుక్స్, 10న కెవిుస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, 11న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (బైపీసీ విద్యార్థులకు), 12న మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలు ఉంటాయి.
అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల విషయానికి వస్తే.. ఆగస్టు 3న సెకండ్ లాంగ్వేజ్, 4న ఇంగ్లీష్, 5న మ్యాథ్స్ పేపర్-2ఏ, సివిక్స్, బోటనీ, 6న మ్యాథ్స్-2బీ, హిస్టరీ, జువాలజీ, 8న ఫిజిక్స్, ఎకనావిుక్స్, 10న కెవిుస్ట్రీ, సోషియాలజీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, 11న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ (Bipc విద్యార్థులకు), 12న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు ఉంటాయి.
ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఆగస్టు 17 నుంచి 22 వరకు నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షను ఆగస్టు 24న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఆగస్టు 26న నిర్వహిస్తారు. కాగా ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…