YS Sharmila : జ‌గ‌న్‌పై ష‌ర్మిళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. పెద్ద బాంబే పేల్చిందిగా..!

YS Sharmila : ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు అన్నీ పార్టీలు కూడా గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇక జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంది. కడప నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వదిన భారతిని ఉద్దేశ్యించి, “రాష్ట్రంలో మరెవరూ వైసీపికి పోటీ ఉండకూడదనుకుంటే ప్రత్యర్ధులు అందరినీ గొడ్డలితో నరికేయండి. అప్పుడు మీరు కోరుకుంట్లుగా రాష్ట్రంలో వైసీపి ఒక్కటే ‘సింగిల్ ప్లేయర్’గా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించేవారే రాష్ట్రంలో ఉండరు కూడా,” అని వైఎస్ షర్మిల అన్నారు.

భారతి ఇటీవల కడపలో ఎన్నికల ప్రచారం చేస్తూ కడపలో వైసీపి (అవినాష్ రెడ్డి) సింగిల్ ప్లేయర్ అని, ఆయనకు మరెవరూ పోటీ కారని అన్నారు. కడపలో తాను పోటీలో ఉండగా మరెవరూ పోటీలో లేరన్నట్లు వదినమ్మ భారతి మాట్లాడినందుకు వైఎస్ షర్మిల ఆగ్రహం కలిగిన్నట్లుంది. బహుశః అందుకే అలా అని ఉండవచ్చు. మ‌రోవైపు ఎన్నికల్లో పరాజయం తప్పదని భావించి మా జగన్ మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లిపోతున్నారంటూ చెప్పుకొచ్చారు ష‌ర్మిళ‌. ఊరు దాటి పోవడానికి, ఇక ఓటమిని ఒప్పుకుని అంగీకరించే పరిస్థితికి వచ్చేసారు. నేను ఓడిపోతే నా అరెస్టు ఖాయమని అనుకుని పాస్ పోర్ట్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే వాళ్లు విదేశీ ప్రయాణం పేరిట తప్పించుకునే ప్లాన్ చేస్తున్నారు అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

YS Sharmila sensational comments on cm ys jagan recent times
YS Sharmila

అయితే జగన్‌ దంపతుల ఇద్దరు కుమార్తెలలో ఒకరు లండన్‌లో మరొకరు అమెరికాలో చదువుకుంటున్నారు. కనుక మే 13న ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన మర్నాడే లండన్‌లో కూతురు వద్దకు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు వారు విదేశాలలో తమ కుమార్తెలతో గడిపి రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు కూడా వారివురూ విదేశాలలోని తమ కుమార్తెల వద్దకు వెళ్ళి వచ్చారు. కానీ అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కీలకమైన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌ ఇంకా మొదలవక ముందే జగన్‌ దంపతులు విదేశాలకు బయలుదేరుతుండటం నిజమే అయితే అది ప్రజలకు ముఖ్యంగా వైసీపి శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago