Posani Krishna Murali : చిరంజీవిపై పోసాని ఫైర్.. అప్పుడు వెన్నుపోటు పొడిచి, ఇప్పుడెలా అడుగుతావ్ అంటూ ప్ర‌శ్న‌లు..

Posani Krishna Murali : ఇప్పుడు ఏపీ రాజ‌కీయాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్ర‌చార స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆయా పార్టీలు ప్ర‌చారం స్పీడ్ పెంచాయి.ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సారి గెల‌వాల‌నే క‌సితో ఉన్నారు.ఆయ‌న కోసం మెగా హీరోల‌తో పాటు శ్రేయోభిలాషులు కూడా వ‌చ్చి ప్ర‌చారాలు చేస్తున్నారు. రీసెంట్ చిరంజీవి కూడా ప్ర‌త్యేక వీడియో విడుద‌ల చేసి ప‌వ‌న్‌కి త‌న మ‌ద్ద‌తు తెలియ‌జేశారు. చిరు స‌పోర్ట్ చేసిన త‌ర్వాత ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది. ఈ క్ర‌మంలో వైసీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణమురళి.. చిరంజీవి తీరుపై మండిపడ్డారు. రాజకీయాలు నాకు సరిపోవంటూ వదిలేసి వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జనసేనకు ఓటు వేయమని ఎలా కోరుతారంటూ నిలదీశారు. ప‌వన్ కళ్యాణ్‌కు గెలిపించమని చిరంజీవి ఎలా చెబుతారు. ప్రజలంటే ఆయనకు చాలా చీప్ అభిప్రాయం.. వాళ్లేం చేస్తారులే అనుకుంటారు. ఆయన ఓ వెరీగుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో టాప్ హీరో. చిరంజీవి ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయి. ఏ రోజైనా రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించారా? ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో అయినా కూర్చున్నారా. ముఖ్యమంత్రి అయితే ఎంజాయ్ చేద్దాం. ఓట్లు వేయకపోతే వెళ్లిపోదాం అనుకున్నారు. ఆయన దృష్టిలో అది బిజినెస్.

Posani Krishna Murali sensational comments on chiranjeevi for supporting pawan kalyan
Posani Krishna Murali

18 మంది ఎమ్మెల్యేలను మీ దారి మీరు చూసుకోమన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కేంద్ర మంత్రి అయ్యారు. మరి అక్కడైనా ఉన్నారా?” అని నిలదీశారు. “రాజకీయం నాకు సెట్ కాదు. వద్దని వెళ్లిపోయారు. తప్పుతెలుసుకుని వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ ఇప్పుడెందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారు. చిరంజీవి జీవితంలో మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లొచ్చా? అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు కాపు యువత బలయ్యారన్న పోసాని.. మళ్లీ ఇప్పుడు జనసేన తరుపున ప్రచారం చేయడానికి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. రూపాయి లంచం లేకుండా పేదల ఖాతాల్లోకి నగదు జమ జరుగుతోందని, జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయ‌ని చెప్పుకొచ్చారు పోసాని.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago