YS Sharmila : వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలిస్తే ఎలా.. ష‌ర్మిళ షాకింగ్ స‌మాధానం..!

YS Sharmila : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలపై కసరత్తు చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో గతంలో వర్కవుట్ అయిన సక్సెస్ ఫుల్ వ్యూహాలపైనా దృష్టిపెడుతున్నాయి. అలాంటిదే ఓ వ్యూహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్త పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల కూడా అమల్లో పెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా పై తొలి సంతకం పెడతానని స్వయంగా ప్రకటించినా నమ్మని ఏపీ ఓటర్లను నమ్మించేందుకు షర్మిల ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల్ని అమలు చేయని బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నారని అన్న జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఇవే అంశాలు జనంలోకి వెళ్లి చర్చ మొదలైతే కచ్చితంగా బీజేపీతో జగన్ కు గ్యాప్ పెరుగుతుందని షర్మిల అంచనా వేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే చేతులారా చేసుకున్నది జగన్ ఆన్న గారే అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్సార్ భార్య విజయమ్మ అని వివరించారు. యావత్‌ కుటుంబం దీనికి సాక్ష్యంగా ఉన్నరని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉన్నప్పుడు తాను నిలబడ్డానని చెప్పుకొచ్చారు. 18 మంది రాజీనామాలు చేసి జగన్ వైపు నిలబడితే అధికారంలోకి వచ్చాక మంత్రులను చేస్తా అన్నారని గుర్తు చేశారు. ఇవాళ వారిలో ఎంతమంది మంత్రులు ఉన్నారో చెప్పాలన్నారు. వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ,నేను వాళ్ళ కోసం తిరిగామని వివరించారు. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డామన్నారు. వాళ్ళను గెలిపించామని గుర్తు చేశారు.

YS Sharmila reply to his brother win if
YS Sharmila

ఇక వైఎస్ ష‌ర్మిళ మాట్లాడుతూ.. వైసీపీ నాయ‌కులు ప్ర‌తి విష‌యంలో బీజేపీ ఎంపీల‌కి స‌పోర్ట్ చేస్తున్నారు. జగన్, ఆయన పార్టీని,రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఘాటుగా ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ వైఎస్ఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. అంతకు ముందు ఏ ప్రభుత్వాలు చేయని సాహసం వైఎస్ఆర్ చేశారని అన్నారు. వైఎస్సార్ 2004 లో ముఖ్యమంత్రిగా ఆయిన 6 నెలల్లో ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టారని వివరించారు. వైఎస్సార్ హయాంలో 4500 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించారని… ఆయన మరణం తర్వాత టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్ ను నిరక్ష్యం చేశాయని ఆరోపించారు. గన్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అయిందన్నారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా మార్చారని అభిప్రాయపడ్డారు ష‌ర్మిళ‌.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago