YS Sharmila : ప్రస్తుతం ఏపీలో వార్ మాములుగా జరగడం లేదు. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల పోరాటం ఉధృతం చేశారు. బాపట్లలో నిర్వహించిన రోడ్షోకు ఊహించని విధంగా జనం తరలి వచ్చారు. గత కొద్ది రోజులుగా షర్మిల, జగన్ అభిమానుల మధ్య జరుగుతున్న పోరును మరింత ఉధృతం చేశారు.జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో షర్మిల సోదరుడు జగన్ మోహన్ రెడ్డిని ఏకవచనంలో పిలవడంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. షర్మిలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో షర్మిల ఇకపై జగనన్న అంటానని ప్రకటించారు.
పీసీసీ అధ్యక్షురాలికి భద్రత కల్పించడం లేదంటే అసలు ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా అంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్తానికి రక్షణ ఉంటే సరిపోతుందా ? పెద్దపెద్ద హోటళ్లు, గడుల్లో ఉంటూ రక్షణ కల్పించుకుంటే ప్రతిపక్షాలకు, ప్రజలకు రక్షణ కల్పించే అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి్ంది చాలని అన్నారు. ఈసారైనా అసెంబ్లీలో ప్రత్యేక హోదా , పోలవరం రాజధాని పై చర్చ జరిపి తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. షర్మిల ప్రసంగాల్లో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగనన్న అంటూనే ఆయనపై కోపాన్ని దాచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు.
పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నా ఎప్పుడు ప్రజల మధ్యకు రారని ఎద్దేవా చేవారు. ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ బయటకు వచ్చారని, దేనికి సిద్ధం జగన్ సార్..? అని నిలదీశారు. మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా అని విమర్శించారు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ? అని ప్రశ్నించారు.ఇక షర్మిళ నిర్వహించిన సభలో ఓ వ్యక్తి మాట్లాడుతూ రాజన్న రాజ్యంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు అందుకున్నాం. కాని ఆయన తనయుడు మాత్రం ఏం చేస్తున్నాడు. జగన్ వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు నువ్వన్నా కూడా ఏదైన చేస్తావని ఆశిస్తున్నాం అని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…