YS Jagan : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ గడువు పూర్తి అయ్యే సమయానికి బొత్స సత్యనారాయణ ఒక్కరే నామపత్రాలు దాఖలు చేశారు. దీంతో పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయనే ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్సీగా గెలవడంతో.. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు.. ఇవాళ తన చాంబర్లో బొత్స సత్యనారాయణతో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. చైర్మన్ మోషేన్ రాజు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన మరుసటి రోజే ఆయను శాసన మండలిలో ప్రతిపక్షనేతగా గుర్తించాలని వైఎస్సార్సీపీ పార్టీ నేత జగన్ శాసనమండలి ఛైర్మన్కు లేఖ రాశారు.
బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనందున ఆయనను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత.. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వైఎస్ జగన్ను బొత్స సత్యనారాయణ కలిశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకం అయ్యారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్గా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు లేఖ రాశారు.
ప్రస్తుతం శాసన సభలో వైసీపీ కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల పాత్ర క్రియాశీలంగా మారింది. అయితే బొత్స ఇప్పుడు మండలికి నాయకత్వం వహించడం పార్టీకి ప్రయాజనంగా మారింది. బొత్స నాయకత్వం వహించడం అన్నిరకాలుగా మంచిదని వైసీపీ నాయకులు చెబుతున్నమాట. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్గా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణను శాసనమండలి పక్షనేతగా నిర్ణయిస్తూ వైసీపీ అధిష్ఠానం లేఖ ఇవ్వనుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…