Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు స్టార్ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చారు. కష్టపడి మాత్రం కొనసాగ దలచుకోలేదు. ఆయన ప్రజా సేవ చేయాలని తపించిన వారే. ఆయనలో ఆ సేవాభావం లేకపోతే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులను ఎందుకు స్థాపిస్తారు. అది కూడా సినిమాల్లో బిజీగా ఉంటూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అవి.రాజకీయాల్లో హుందాతనం లేకపోవడంతో పాటు చిరంజీవి మృదువుగా వ్యవహరించే నేచర్ వల్ల కొనసాగలేక పోయారు. పైగా ఆయన రాజకీయ అరంగేట్రం సమయం కూడా రాంగ్ గా ఉంది.
ఒక వైపు వైఎస్సార్ మరణం చెందడం, మరో వైపు ఉమ్మడి ఏపీ రెండుగా చీలడంతో ఆయన ఏ వైపు ఉండాలో ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అని అనుకున్నారు అంతా. అయితే చిరంజీవి తెలివిగా చేసింది ఏంటి అంటే తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కేంద్ర మంత్రి అయ్యారు. అలా తన రాజకీయ ప్రస్థానానికి అందమైన ముగింపు ఇచ్చారు. అంతే 2018లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత ఆ వైపు తొంగి చూడలేదు, వంగి వాలలేదు. గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీ నాయకులతో అంటిముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్లే అని అందరూ అనుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని 2027 అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసిన ఐడి కార్డును కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు షాక్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చిరంజీవి తమ పార్టీలో ఉన్నాడని చెప్పుకుంటుండడం కొసమెరుపు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…