YS Jagan : వైఎస్ జగన్ జూన్ 9న మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నాయకులు చెబుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. జూన్ 4న వెల్లడికాబోయే ఫలితాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తాము విశ్వాసంతో ఉన్నామని అన్నారు బొత్స. విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో మమేకమయ్యారని.. ప్రజా అవసరాలకు తగ్గట్లుగా ఆయన పాలన చేపట్టారని అన్నారు. జగన్ తీసుకున్న సామాన్య పౌరుడు ఆర్థికంగా ఎదిగేలా తీసుకున్నామని అన్నారు. సామాన్యులకు పూర్వం నుంచి అందుతూ వస్తున్న సేవల విషయంలో సీఎం జగన్ సంచలన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని అన్నారు. ఇలాంటి విధానాలు ప్రభుత్వం మారితే పోతాయని బొత్స అన్నారు.
తన సొంత నియోజకవర్గం ఉన్న విజయనగరం జిల్లాలో ఉన్న 9 స్థానాల్లోనూ గడిచిన ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని అన్నారు. అదే తరహాలో ఈ సారి పట్టం కడతారని విశ్వాసంతో ఉన్నట్లుగా బొత్స సత్యనారాయణ నమ్మకం వ్యక్తం చేశారు. ఆ జిల్లాలో తాము అనుకున్న దాని కంటే రెండు శాతం ఎక్కువగా పోలింగ్ జరిగిందని అన్నారు. ఇంకా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు గుమ్మం ముందుకే పాలన తీసుకువచ్చామని చెప్పారు. అందుకే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని.. దానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇక్కడి పరిస్థితులను చూసి చాలా రాష్ట్రాల వాలంటీర్ వ్యవస్థను అమలు చేయడానికి రెడీగా ఉన్నాయని అన్నారు.
మరోవైపు . పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నా తాము మాత్రం ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాల జోలికి వెళ్లడం లేదని చెప్పారు. అయితే కౌంటింగ్ రోజు పార్టీ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలని కోరారు. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల ఆటలు సాగనివ్వరాదని పేర్కొన్నారు. తమదే గెలుపంటూ జగన్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుందని తెలియజేశారు జగన్ . ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…