World Cup 2023 : క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా గెలిచి ఆరోసారి కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. వరుసగా తొమ్మిది మ్యాచ్ లు గెలిచిన భారత్ ఫైనల్ లోనూ విజయం సాధిస్తుందని, ప్రపంచ కప్ మనకే దక్కుతుందని యావత్ దేశం భావించింది. కానీ మ్యాచ్ లో భారత్ దారుణంగా ఓడిపోవడంతో క్రికెట్ అభిమానులు అంతగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ భారత్ ఓటమిని ఎవరు జీర్ణించుకోలేక భారత్ ఓటమి పట్ల క్రికెట్ అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టు ఓటమికి కారణం అధికార బీజేపీయే అని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇలాంటి కామెంట్లే చేయగా.. సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జతకూడారు.
పరోక్షంగా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ అహ్మదాబాద్ కు బదులు లక్నోలో కాని లేదంటే ముంబై, ఢిల్లీలో కాని జరిగి ఉంటే టీం ఇండియా తప్పకుండా గెలిచేదని అన్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి వల్ల ఆటగాళ్ల సన్నద్ధత అసంపూర్తిగా మిగిలిపోయిందని కొందరి టాక్. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే అది బీజేపీ ఖాతాలోకి వస్తుందని వారు అహ్మదాబాద్ని ఫైనల్కి వేదికగా మార్చారని కొందరి టాక్. గతంలో ఎప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్లకి రాజకీయ నాయకులు రాలేదు.
కాని ఈ సారి బీజేపీ పెద్దలు అమిత్ షా, నరేంద్ర మోదీ వంటి వారు రావడంతో వరల్డ్ కప్కి రాజకీయ రంగు పులుముకుంది. సాధారణంగా బీసీసీఐ బీజేపీ కిందనే నడుస్తుందని, అందుకే వారు చెప్పినట్టు గుజరాత్లో మ్యాచ్ నిర్వహించారని, అక్కడ పిచ్ బ్యాటింగ్కి అంతగా అనుకూలంగా లేదు. అయినప్పటికి అక్కడే ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం వెనక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టుగా కొందరు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి వరల్డ్ కప్ ఓటమి వెనక బీజేపీ చేసిన ప్రయోగాలు కొంత కారణం అన్నది కొందరి టాక్.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…