Cow : మనిషి మాత్రమే కాదు.. ప్రేమను చూపిస్తే.. ఇతర జీవులు సైతం అంతే ఎమెషనల్గా మనకు కనెక్ట్ అవుతాయి. పెట్ యానిమల్స్, ఆవులు, ఇతర జీవాలు సైతం తమను ప్రేమగా చూసుకునే యజమానుల పట్ల అంతే ఆప్యాయతను ప్రదర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ఆవు మూగ వేదన అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన పోతురాజు సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఆ సమయంలో పొలం నుంచి వచ్చిన ఆవు.. యజమాని సత్యనారాయణమూర్తి మృత దేహం దగ్గరికి వచ్చి విలపించింది.
ఆ ఆవు అరగంట పాటూ యజమాని మృతదేహం దగ్గరే గట్టిగా అరుస్తూ తన బాధను వ్యక్తపరిచింది. దీంతో కుటుంబ సభ్యులను, బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచింది. రక్త సంబంధీకులపైనే ప్రేమ లేని ఈ పరిస్థితులలో ఒక ఆవు ఇలా ప్రవర్తించడం అందరిని ఆశ్చర్యపరచింది. . ఆస్తి కోసం ఒకర్ని.. ఒకరు చంపుకునే పరిస్థితి ఉంది. అలాంటిది ఓ మూగ జీవి యజమానిపై చూపిన ప్రేమను స్థానికులు కొనియాడుతున్నారు. ఆ ఆవును.. చిన్నప్పటి నుంచి సత్యనారాయణ మూర్తి కన్న బిడ్డ వలె సాకాడని.. అందుకే అది అంతగా వేదనకు గురైందని స్థానికులు చెప్పుకొచ్చారు.
అసలు ఆవుకు తన యజమాని ఎలా తెలిసిందో కానీ, పొలంలో ఉన్న ఆవు పరుగు పరుగున యజమాని ఇంటికి వచ్చింది. గట్టిగా అరుస్తూ యజమాని మృత దేహం వద్దే తిరుగాడింది. ఈ ఘటన కుటుంబ సభ్యులను,బంధువులను కన్నీటి పర్యంతం చేసింది. మూగజీవికి యజమాని పట్ల ఉన్న అభిమానానికి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రేమాభిమానాలు మనుషుల్లేనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ ఉంటాయని, తమకూ మనసు ఉంటుందని ఈ ఆవు నిరూపించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…