సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ కెరిర్ లో ఘన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో నరసింహ కూడా ఒకటి అని సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ మేనరిజం, వే ఆఫ్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. నా దారి రహదారి అనే డైలాగ్ ఇప్పటికి కూడా ప్రేక్షకులు సరదాగా వాడుతూ ఉంటారనే విషయం చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సౌందర్య హీరోయిన్ గా నటించారు. అయితే నరసింహ సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటుగా విలన్ గా నటించిన నీలాంబరి క్యారెక్టర్ ఈ చిత్రానికి ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ ప్రతినాయకగా తన అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ సినిమా విజయానికి రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్ర కీ రోల్ అని చెప్పుకోవచ్చు.
ఈ చిత్రానికి గాను కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. దర్శకుడు రవికుమార్ ఒక ఇంటర్వ్యూలో నరసింహ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా స్టోరీని సిద్ధం చేసుకున్న తర్వాత ఇందులో నీలాంబరి పాత్ర కోసం చాలా మందిని అనుకున్నారట. మొదటగా నీలాంబరి క్యారెక్టర్ లో మీనాని అనుకోగా, ఆమె అయితే అంత పొగరుబోతు పాత్రలో సెట్ కాదని భావించి .. నగ్మాతో చేయాలి అనుకున్నారట. కానీ నగ్మా ఇప్పటికే కొన్ని సినిమాల్లో బిజీగా ఉండడంతో, డేట్స్ కుదరకపోవడంతో చివరకు రమ్యకృష్ణకు ఈ సినిమా కథ చెప్పటం జరిగిందట. మొదట రజనీకాంత్ కి వ్యతిరేకంగా ఉన్న పాత్ర చేయడానికి ఆలోచించిన రమ్యకృష్ణ ఆ తర్వాత ఒప్పుకుంది.
అయితే చిత్రకధాంశం ప్రకారం ఇందులో రమ్యకృష్ణ రజినీకాంత్ ను ప్రేమిస్తే.. రజినీకాంత్ మాత్రం రమ్య దగ్గర పని చేసే సౌందర్యను ప్రేమిస్తాడు. దాంతో నరసింహా(రజినీకాంత్) ను ఎలాగైనా దక్కించుకోవాలి అని ఉద్దేశంతో నాటకం ఆడి తన పెళ్లి అతనితో ఫిక్స్ చేసుకుంటుంది నీలాంబరి. ఈ విషయం తెలిసిన సౌందర్య చాలా డల్ గా రమ్యకృష్ణ కాళ్ళుకు గోరింటాకు పెడుతుంటే.. తన కాలిని సౌందర్య మొఖం మీద ఉంచి పక్కకు తిప్పే సన్నివేశం ఒకటి ఉంటుంది. అయితే ఈ సీన్ చేయడానికి రమ్యకృష్ణ మొదట అసలు ఒప్పుకోలేదట. ఈ సీన్ ఖచ్చితంగా చేయాలి అని ఆమె చేత బలవంతం చేసిన తర్వాత ఏడ్చేసిందట రమ్యకృష్ణ. .. కానీ చివరకు సౌందర్య, రజినీకాంత్ ఇలా అందరూ చెప్పేసరికి ఒప్పుకుంది రమ్యకృష్ణ అని రవికుమార్ ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…