సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన రాజకుమారుడు. ప్రేక్షకుల హృదయానే కాదు హీరోయిన్ నమిత హృదయాన్ని కూడా దోచుకొని పెద్దలను ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్నాడు మహేష్. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా మొదటి భార్య ఇందిరా దేవి ఉండగానే విజయనిర్మలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సూపర్ స్టార్ కుటుంబానికి ఒక సీనియర్ హీరోయిన్ తో అనుబంధం ఉంది.
ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు లేడీ బాస్ విజయశాంతి. కృష్ణ ఫ్యామిలీ కి లేడీ బాస్ విజయశాంతికి ఉన్న అనుబంధం ఏమిటి..? మహేష్ బాబుకు విజయశాంతి వరుసకు ఏమవుతుంది..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి అంటే సూపర్ స్టార్ కృష్ణ వివాహ జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవికి విడాకులు ఇవ్వకుండానే మొదటి భార్య అంగీకారంతో 1969లో విజయనిర్మలను ప్రేమించే వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఇందిరాదేవికి కృష్ణకు ఐదుగురు సంతానం ఉన్నారు. రమేష్ బాబు, పద్మావతి, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని. ఈ ఐదుగురు సంతానంలో మహేష్ బాబు, రమేష్ బాబు, మంజుల సినీమాల ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఇక విజయనిర్మల విషయానికొస్తే కృష్ణతో కలిసి నటించినప్పుడు ఏర్పడిన పరిచయం ఆ తర్వాత కాలంలో ప్రేమగా మారి వివాహ బంధానికి దారితీసింది.
విజయనిర్మల మొదటి భర్త అయిన కె.ఎస్. మూర్తికి విడాకులు ఇచ్చి సూపర్ స్టార్ కృష్ణ ను వివాహం చేసుకుంది. కృష్ణని వివాహం చేసుకున్న సమయానికి విజయనిర్మలకు మొదటి భర్తతో కలిగిన సంతానం నరేష్ ఉన్నాడు. రెండవ వివాహం చేసుకున్న కృష్ణ తన మొదటి భార్య ఇందిరా దేవిని కానీ, ఆయన ఐదుగురు సంతానాన్ని గాని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అదేవిధంగా విజయనిర్మల కూడా తన మొదటి భర్తకుతో కలిగిన సంతానం నరేష్ కూడా విడిచిపెట్టలేదు.
అసలు విషయానికి వెళితే విజయశాంతికి కృష్ణ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటంటే..? విజయనిర్మల మొదటి భర్త కె.ఎస్ మూర్తి స్వయానా చెల్లెలు విజయలలిత. ఈమె విజయనిర్మలకు స్పయాన ఆడపడుచు అవుతుంది. ఒక దశాబ్దం పాటు విజయలలిత చాలా చిత్రాల్లో నటించి అప్పటిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వారికి ఆమె గుర్తుకు రావాలి అంటే వెంకటేష్ హీరోగా నటించిన సాహసవీరుడు సాగరకన్య చిత్రంలో విజయలలిత మాంత్రికురాలిగా నటించింది. ఇక విజయశాంతికి విజయలలిత స్వయానా పిన్ని వరుస అవుతుంది. దీని బట్టి విజయశాంతి మహేష్ బాబుకి స్వయాన వదిన వరుస అవుతుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…