Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్ మీద ఉన్నాడు. అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా తప్పుకున్న తరువాత కోహ్లి ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. దీంతో ఓ దశలో జట్టులో చోటు కోల్పోతాడా.. అని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే అందరి అంచనాలను తారు మారు చేస్తూ కోహ్లి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. గతేడాది నిర్వహించిన ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో సెంచరీతో కదం తొక్కాడు. 3 ఏళ్ల తరువాత కోహ్లి ఈ సెంచరీ చేయడం విశేషం. అలాగే గతేడాది బంగ్లాదేశ్తో జరిగిన ఓ వన్డే మ్యాచ్లోనూ కోహ్లి 113 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లోనూ కోహ్లి 2 వన్డేల్లో 2 సెంచరీలను నమోదు చేశాడు. ఇలా కోహ్లి ఈ మధ్య ఫుల్ ఫామ్లోకి వచ్చేశాడు. అయితే తాజాగా కోహ్లి మీడియాతో మాట్లాడుతూ తన మాజీ టీమ్ మేట్, మాజీ కెప్టెన్ ధోనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
తన చిన్న తనం నుంచి తన క్రికెట్ కోచ్, ఫ్యామిలీ తన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారని.. తనకు ప్రోత్సాహం అందించారని కోహ్లి తెలిపాడు. తరువాత అనుష్క శర్మ తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తనకు ఎనలేని సపోర్ట్ను అందించిందని తెలిపాడు. అయితే వీరి తరువాత తనకు సపోర్ట్గా నిలిచిన ఏకైక వ్యక్తి ధోనీయేనని కోహ్లి తెలిపాడు. తాను గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధోనీ తనకు ఎంతో విలువైన సలహాలు ఇచ్చాడని, ధోనీ వల్లే తాను మళ్లీ ఫామ్లోకి వచ్చానని చెప్పాడు.
నువ్వు స్ట్రాంగ్ గా ఉండి.. నీ ఆట నువ్వు ఆడితే.. నీ గురించి ఎవరూ మాట్లాడరని.. నువ్వ ఫామ్ కోల్పోతే నీ వైపే అందరూ వేలెత్తి చూపిస్తారని.. అప్పుడు ఇంకా కష్టమవుతుందని.. కనుక అలాంటి పరిస్థితిలోంచి బయట పడాలని.. తనకు ధోనీ సలహా ఇచ్చాడని.. కోహ్లి తెలియజేశాడు. ఈ మేరకు కోహ్లి తన ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ నిర్వహించిన ఓ పాడ్ కాస్ట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు.
అయితే కోహ్లి ఈ విధంగా ధోనీని ఆకాశానికి ఎత్తేయడంతో.. అటు కోహ్లితోపాటు ఇటు ధోనీ ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. ధోనీ తరువాత నిజమైన కెప్టెన్సీ చేయగల సమర్థుడు కోహ్లియే అని ట్వీట్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లోనూ రాణిస్తున్నాడు. త్వరలో ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…