Virat Kohli : మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ముగిసిన తరువాత వెస్టిండీస్-అమెరికాలో జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. మొత్తం 20 దేశాలు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ జూన్ 29వ తేదీన ముగియనుంది. అయితే టీ20 వరల్డ్ కప్లో ఆడేందుకు గాను అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటి వరకు అయితే జట్లను ప్రకటించలేదు. కనీసం 20 రోజుల ముందు జట్లను ప్రకటించే అవకాశం ఉంది. అప్పటికి ఐపీఎల్ ముగింపునకు వస్తుంది.
ఈ క్రమంలో ఐపీఎల్లో ప్రదర్శనను బట్టి జట్టును ప్రకటించవచ్చని బీసీసీఐ మాత్రమే కాదు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సైతం ఆలోచిస్తున్నాయి. అయితే ఈ సంగతి అలా ఉంచితే భారత జట్టులో మాత్రం ఈసారి వరల్డ్ కప్ లో ఎవరు ఆడుతారా.. అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. మరి వారిలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారు, ఫైనల్ 11 ఎవరు, కెప్టెన్గా ఎవరు ఉంటారు.. అని చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటికీ త్వరలోనే చెక్ పడే అవకాశం ఉన్నా.. ఒక్క విషయం మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ను షాక్కు గురిచేస్తోంది.
విరాట్ కోహ్లికి ఎంత మంది అభిమానులు ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. భారత ప్లేయర్లందరి కన్నా కోహ్లికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే కోహ్లి వచ్చే టీ20 వరల్డ్ కప్లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ అతన్ని స్వయంగా తప్పుకోమని సలహా ఇస్తుందట. ఈ మేరకు ఆపనిని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు అప్పగించిందట. కారణం.. వెస్టిండీస్లో స్లో పిచ్లు ఉంటాయని, అవి కోహ్లికి సరిపోవని, కనుక కోహ్లి తనంతట తానుగా ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే మంచిదని బీసీసీఐ ఇప్పటికే అతనికి సూచనలు చేసిందట. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఇది నిజం అయితే ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురి కాక తప్పదని తెలుస్తోంది. మరి నిజంగానే కోహ్లి లేకుండా భారత జట్టు విండీస్ పర్యటనలో టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందా.. లేక చతికిల పడుతుందా.. అన్నది త్వరలోనే తేలనుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…