CM Revanth Reddy : టీడీపీతో బీజేపీ పొత్తు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రతి రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పొత్తులు పెట్టుకుంటున్నారని.. 400 సీట్లు వస్తాయని నమ్మకం ఉంటే పొత్తులు ఎందుకు..? అని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్నారని.. 400 సీట్లు గెలిచేలా ఉంటే చంద్రబాబుతో పొత్తు ఎందుకు..? అన్నారు. మహారాష్ట్రలో శివసేనను, ఎన్సీపీ పార్టీలను చీల్చారని ఫైర్ అయ్యారు. మేడ్చల్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా ఉంటే పొత్తులు పెట్టుకోవడం ఎందుకు అని బీజేపీ ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి.. వాళ్ళతోనే పొత్తులకు దిగారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమి మొత్తం అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో గత పదేళ్లలో మేడ్చల్‌లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను వేగంగా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. కొందరు తమ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని అంటున్నారని.. తాము అల్లాటప్పాగా అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా..? అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే తమ కార్యకర్తలు ఊరకోరని అన్నారు. తాము మంచివాళ్లం కాబట్టే మీరు ఇంకా తిరుగుతున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఫామ్ హౌస్ గోడలు ఉండవని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తమను టచ్ చేసి చూడాలని అని సవాల్ విసిరారు.

CM Revanth Reddy sensational comments on tdp and bjp alliance
CM Revanth Reddy

ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని కవిత మాట్లాడుతున్నారని.. తాము భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాల్లో 43 శాతం ఆడబిడ్డలకు ఇచ్చామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. లెక్కలతోపాటు పేర్లతో సహా చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ధర్నా చౌక్ వద్దన్న వాళ్లు.. ఇప్పుడు సిగ్గులేకుండా వెళ్లి ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తున్నారని కవితను ఉద్దేశించి సెటైర్లు వేశారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని విమర్శించారు. హరీశ్‌ రావు మేడిగడ్డకు రమ్మంటే రారని.. అసెంబ్లీలో మైక్ ఇస్తే మాట్లాడరని ఎద్దేవా చేశారు. మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు రావాలని.. ఇక్కడ భూముల విలువలు పెరగాలని అన్నారు రేవంత్ రెడ్డి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago