Vijayendra Prasad : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక నటుడే కాదు రాజకీయ నాయకుడు కూడా. జనసేన అనే పార్టీని స్థాపించి ఇప్పుడు ఏపీలో తమ పార్టీ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పై ఇటీవల కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే, మరి కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్పై బాహుబలి రైటర్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటే దోచుకోవడం, దాచుకోవడంగా మారింది. అలాంటి తరుణంలో గొప్ప నేతగా పవన్ కల్యాణ్ కనిపించాడు అని ఆయన అన్నాడు. హైదరాబాద్లో మహా టెలివిజన్ కొత్తగా ప్రారంభించిన ఎంటర్టైన్మెంట్ ఛానెల్ మహా మ్యాక్స్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, విజయేంద్ర ప్రసాద్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రీసెంట్ గా ఓ వీడియో చూశానని అందులో విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి వచ్చిన హిందువులకి దాహార్తి తీర్చడానికి ముస్లింలు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఆ దృశ్యం నాకు ఎంతో ఆనందం కలిగించి ఇప్పటికీ కూడా దానిని తలచుకున్నా అంతే ఆనందంగా ఉందని తెలిపారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఉండాలి ఇలాంటివి జరగాలి అంటే నీతి నిబద్ధత ఉన్న నాయకుడు కావాలి అయితే అదృష్టవశాత్తు మనకి పవన్ కళ్యాణ్ ఉన్నారు. మీరు అంటే ప్రాణం ఇచ్చే అశేషమైన జన సైనికులు ఉన్నారు. నేను ఏం చెప్పానో అది దయచేసి మీవారితో చెప్పి మతసామరస్యం పెంచడం కోసం అందుకు అవకాశం, అదృష్టం రెండూ మీకు ఉన్నాయి చెయ్యండి అంటూ తెలిపారు.
అయితే విజయేంద్ర ప్రసాద్ సహా పవన్ కూడా మన దేశం పట్ల అపారమైన దేశభక్తి కలవారు మరి పవన్ ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో అని అందరు ఆలోచనలు చేస్తున్నారు. నేటి తరం రాజకీయాల గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఏం మాట్లాడుతారో.. ఏం ఆలోచిస్తూ ఏం మాట్లాడుతారో అనే విధంగా ఒక నీతి, నిజాయితీ కల లీడర్ కావాలి. మన అదృష్టం కొద్ది మనకు పవన్ కల్యాణ్ లాంటి లీడర్ దొరికాడు అని పవన్ కల్యాణ్ను ప్రశంసలతో ముంచెత్తాడం కొసమెరుపు.విజయేంద్ర ప్రసాద్కి అలానే రాజమౌళికి కూడా పవన్ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో సినిమాలు చేయాలని వారద్దరు కోరుకుంటున్నారు. మరి జరుగుతుందా లేదా అనేది చూడాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…