Venu Swamy : ఇటీవల సెలబ్రిటీల జాతకాలు చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి. సమంత- నాగ చైతన్య విడాకుల గురించి చెప్పి అందరి దృష్టిని ఆకర్షించిన వేణు స్వామి .. నిహారిక విడాకుల గురించి కూడా ముందే చెప్పాడట. ఇక ఆయనతో ఇటీవల నిధి అగర్వాల్, రష్మిక, డింపుల్ వంటి వారు కూడా పూజలు చేయించుకోవడంతో చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఆయన 2024లో సీఎం ఎవరు అవుతారని కూడా కొద్ది రోజుల క్రితం చెప్పుకొచ్చాడు. 2024 ఎన్నికల్లో కూడా జగనే ముఖ్యమంత్రి కాబోతున్నారని.. అది కూడా పవన్ కళ్యాణ్ వల్లనే ఆయన గెలవబోతున్నట్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ గెలిచినా.. తెలుగుదేశం పార్టీ ఓడినా.. లేదంటే రివర్స్ అయినా అది పవన్ కళ్యాణ్ వల్లే కానీ.. అతను గెలవడానికి మాత్రం కాదని వేణు స్వామి చెప్పారు.. వేరే వాళ్లని సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ ఉన్నదని వేణు స్వామి అన్నారు. అయితే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి.. పవన్ కళ్యాణ్ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే మాత్రం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని అన్నారు. అయితే చంద్రబాబు తాను కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం అంటే అంతకు మించిన జోక్ ఉండదన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి అధికారం చేపడితే అది అంధకారమే అవుతుంది కాబట్టి వీళ్ల కలయిక ప్రత్యర్ధి అయిన జగన్కి లాభదాయకం అవుతుందని జోస్యం చెప్పారు వేణుస్వామి.
పవన్ కు జనాదరణ విపరీతంగా ఉంటుందని..కానీ, ఓట్లు పడవని చెప్పుకొచ్చారు.. గురు గ్రహం నీచంలో ఉండటంతో జగన్ ను తిట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని..ఓట్లు మాత్రం జగన్ కే వేస్తారని విశ్లేషించారు వేణు స్వామి. అయితే రీసెంట్గా ఆయన తిరుమలలో ప్రత్యక్షం కాగా, ఆయనని 2024లో ఎవరు సీఎం అవుతారని ప్రశ్నించారు. దానికి స్పందించిన వేణు స్వామి నేను ముందు ఎవరు అవుతారని చెప్పానో వారే అవుతారు. దేవుడి ముందు పేర్లు చెప్పడం బాగుండదు అని వేణు స్వామి అన్నారు. ఆయన జోస్యంలో తిరుగుండదు అన్నట్టుగ కామెంట్ చేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…