VC Sajjanar : ప్రస్తుత మార్కెట్లో యాడ్స్ అనేవి చాలా కీలకం. కంపెనీలు తమ ప్రాడక్ట్స్ ను అమ్ముకోవడం కోసం ఎన్నో ఎత్తులు పై ఎ్తతులు వేస్తాయి. కోట్లు పెట్టి సెలబ్రిటీలతో యాడ్స్ తీసి సొమ్ము చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సెలబ్రిటీలు కూడా ఆ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులు, ప్రొడక్ట్స్ మంచివా, హానికరమైనవా చూడకుండా ప్రకటనల్లో నటించడం, తర్వాత చిక్కుల్లో ఇరుక్కుంటుండడం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక అభ్యర్థన చేశారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సహా సెలబ్రిటీలందరికీ ‘ఆమ్వే’ లాంటి మోసపూరిత సంస్థలకు సహకరించొద్దని రిక్వెస్ట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి మోసపూరిత సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దంటూ అభ్యర్ధించారరు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆమ్వేకి బిగ్బీ ప్రచారం చేయడంపై ఆయన్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ఈ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ‘క్యూనెట్’ లాంటి సంస్థలకు సంబంధించిన యాడ్స్లలో నటించొద్దని, అలాంటి కంపెనీలను ప్రమోట్ చేయొద్దని సజ్జనార్ కోరిన విషయం తెలిసిందే.
ఆమ్వే కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ కు పాల్పడుతోందని ఈడీ 2022 లో ఆరోపించింది. ఆమ్వే ఆస్తులను సీజ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఆమ్వే అనేది.. ఆరోగ్యం, సౌందర్యానికి సంబంధించి పలు ఉత్పత్తులను మార్కెట్ చేసే ఒక అమెరికన్ ఆధారిత సంస్థ కాగా, ఇది స్కామ్కు పాల్పడుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతేడాది ఏప్రిల్లో ఆరోపించింది. సంస్థ అసలు ఉద్దేశం ఉత్పత్తులను విక్రయించడం కాదని, గొలుసుకట్టు స్కీముల్లో ప్రజలను చేర్పించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కొన్నాళ్ల క్రితం ఆమ్వేకు చెందిన సుమారు రూ.757 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…