Vangaveeti Radha : వంగవీటి రాధా.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విజయవాడ పాలిటిక్స్లోనే కాదు.. ఏపీ పాలిటిక్స్లో కీలక నేతగా ఉన్న రాధా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా పెళ్ళి చేసుకోనుండగా, బెజవాడ రాజకీయవర్గాల్లో ఇదొక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇంతకీ ఇన్నాళ్ల తరువాత రాధ పెళ్ళి చేసుకోనుంది ఎవరిని అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. వంగవీటి రాధాకృష్ణ త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైంది.
తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లు పేర్కొంటున్నారు. ఈ నెల 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్.. అక్టోబర్లో పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు రాధాకృష్ణ.. ఇక రాధ పెళ్ళి చేసుకోరు అని అనుకున్న వారంతా ఆయన పెళ్ళి వార్త విని ఆశ్చర్యపోతున్నారు. వంగవీటి ఇంటి కోడలు కాబోతున్న అమ్మాయి ఎవరు? ఆమె ఎలా ఉంటారు? అని తెగ ఆరా తీస్తున్నారు అభిమానులు. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి అమ్మాని దంపతుల చిన్న కుమార్తెనే వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. బాజ్జి దంపతలుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి ద్వితీయ పుత్రిక పుష్పవల్లిని రాధాకు ఇచ్చి పెళ్లి చేయనున్నారు. జక్కం అమ్మాని 1987-92 వరకు నరసాపురం మున్సిపాలిటీ టిడిపి చైర్ పర్సన్గా బాధ్యతలు నిర్వహించారు.
పుష్పవల్లి స్కూల్, కాలేజ్ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది. అనంతరం హైదరాబాద్లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొంత కాలం హైదరాబాద్లో యోగా టీచరుగా చేసిన పుష్పవల్లి.. ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టారు. తండ్రి టిడిపి ఆవిర్భావం నుండి నరసాపురం రాజకీయాలలో కీలక పాత్ర పోషించేవారు. అయితే అనివార్య కారణాలవల్ల కొంతకాలం హైదరాబాద్కు మకాం మార్చారు. ఇటీవలి కాలంలో మళ్ళీ నరసాపురంలో నూతన గృహ నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు. ఇటీవల ఈయన జనసేన పార్టీలో చేరి.. క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురం వచ్చినప్పుడు వీరి ఇంట్లోనే బస చేశారు. ఇటీవల వంగవీటి రంగ జయంతి సందర్భంగా వంగవీటి రాధా వీరి నివాసానికి వచ్చి.. రంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగానే రాధా మిత్రులు వివాహ సంబంధం గురించి ఇరువైపులా పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఖరారైంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…