Upasana : చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్ ద‌క్క‌డంపై తొలిసారి స్పందంచిన ఉపాస‌న‌

Upasana : రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారాలు పద్మ అవార్డులను ప్రకటించగా, ఇంద‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల‌కి చెందిన ప‌లువురికి ప‌ద్మ పురస్కారాలు ద‌క్కాయి. మెగాస్టార్ చిరంజీవికి దేశంలో రెండో అత్యున్నత అవార్డ్ పద్మ విభూషణ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంపై మెగా ఫ్యామిలీ పెద్ద కోడలు చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎంతో సంతోషంగా ఉన్నారు. మామగారికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. నిన్న చిరుకు సంబంధించిన అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

చిరంజీవి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోనుండడంతో మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. తాజాగా, మెగా కోడలు ఉపాసన ఆసక్తికర ట్వీట్ చేశారు. తమ కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్ లు ఉన్నారని వెల్లడించారు. ఒకరు తన తాతయ్య డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, మరొకరు తన మామయ్య చిరంజీవి కొణిదెల అని వివరించారు. తమ కుటుంబానికి ఇంతటి విశిష్ట గౌరవం దక్కడాన్ని ఆశీర్వచనంలా భావిస్తున్నామని ఉపాసన పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి, ప్రతాప్ సి రెడ్డి కలిస్తున్న ఫొటోను కూడా ఆమె ఎక్స్ లో పంచుకున్నారు. ఐదుగురు మనవరాళ్లతో చిరు కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో చిరు ఒడిలో క్యూ్ట్ క్లింకార కూడా కనిపించింది. ఇక ఇప్పుడు మరో ఫోటో షేర్ చేస్తూ తమ కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణులు ఉన్నారంటూ సంబరపడిపోయారు.

Upasana responded on chiranjeevi getting padma vibhushan
Upasana

అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డికి కేంద్రం 1991లో పద్మ భూషణ్ ప్రకటించింది. 2010లో ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించారు. చిరంజీవి 2006లో పద్మ భూషణ్ అందుకున్నారు. ఇప్పటికే చిరుకు పద్మ భూషణ్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. 2006లో కేంద్రం ఆయనకు పద్మ భూషణ్ ప్రకటించింది. ఇక ఇప్పుడు పద్మ విభూషణ్ అందుకున్నారు చిరు. ప్రస్తుతం చిరు విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార సినిమా డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో త్రిష కథానాయికగా నటించనుందని టాక్.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago