Upasana : టాలీవుడ్ క్యూట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనలు 2012 జూన్ 14న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దోమకొండ సంస్థానం వారసురాలైన ఉపాసనను రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకోగా, వారు పదేళ్లకు పైగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వాళ్లకు పిల్లలు లేకపోవడం అందరిలో అనేక అనుమానాలు రేకెత్తించింది. పలు సందర్భాలలో రామ్ చరణ్, ఉపాసనలని ఇదే విషయంపై ప్రశ్నలు కూడా అడిగారు. ఎట్టకేలకు వారు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని చిరు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదాలతో రామ్ చరణ్ మరియు ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయాన్ని, ఒక శుభవార్తగా సోషల్ మీడియాలో తెలియజేస్తూ చిరంజీవి ఏమన్నారంటే సో ఎక్సయిటెడ్ టు షేర్ థిస్ న్యూస్,” అంటూ రాశారు.
ఈ విషయంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుండగా, యాంటీ ఫ్యాన్స్ కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఉపాసన-రామ్ చరణ్ పిల్లల కోసం సరోగసీ పద్ధతి ఆశ్రయించారని, ఆ క్రమంలోనే ఉపాసన గర్భం దాల్చారంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సెలబ్స్ చాలా మంది సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిస్తుండగా, ఇప్పుడు ఉపాసన కూడా అదే పద్ధతిని ఆశ్రయించిందని చెప్పుకొస్తున్నారు. అయితే టాలీవుడ్ లో సరోగసీ పద్దతిలో మంచు లక్ష్మి తల్లయ్యారు. ఆమెకు పెద్ద సెలబ్రిటీ స్టేటస్ లేదు కాబట్టి ఎలాంటి ఇష్యూ కాలేదు.
రామ్ చరణ్ దంపతులు సరోగసీ పద్దతిలో పేరెంట్స్ అయ్యారని తెలిస్తే అతిపెద్ద వివాదం అవుతుంది. సాంప్రదాయవాదులు వ్యతిరేకించే కృత్రిమ పద్దతిలో తల్లిదండ్రులు కావడం అంతగా హర్షణీయం కాదు. ఇటీవల నయనతార దంపతులు సరోగసీ పద్దతిలో ఇద్దరు అబ్బాయిలకు తల్లిదండ్రులు అయ్యారు. అదే సమయంలో విమర్శలపాలయ్యారు. నయనతార ఈ వివాదం నుండి బయటపడడానికి చాలా సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. మరి రామ్ చరణ్ విషయంలో ఏం జరుగుతుందనేది త్వరలోనే తెలియనుంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…