Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఆయన సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో చాలా రిజర్వ్డ్గా ఉండడం వలన ఎవరు కూడా పవన్పై పెద్దగా విమర్శలు చేసే వారు కాదు. ఎప్పుడైతే సినిమాలలోకి వచ్చారో అప్పటి నుండి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల హరి హర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోన్న స్టిల్ను షేర్ చేయగా, పవన్ అభిమానులు దానిపై పాజిటివ్ కామెంట్స్ చేస్తూ పిక్ వైరల్ చేయగా, వైసీపీ నాయకులు కూడా స్పందించారు. దీన్ని మార్షల్ ఆర్ట్స్ అంటారా? ఏంటా పిచ్చి చేష్టలు అంటూ దారుణంగా తిట్టేశారు.
అయితే ఇప్పుడు వైసీపీ శ్రేణుల ట్రోలింగ్లో మంచు లక్ష్మీ వచ్చింది. చివరకు నువ్ మంచు లక్ష్మీని కాపీ కొట్టి స్టిల్స్ పెడుతున్నావ్ అంటూ మీమ్స్ చేశారు. ఇందులో మంచు లక్ష్మీ కలరి పట్టు నేర్చుకుంటున్నప్పుడు దిగిన స్టిల్స్ను పెట్టి పవన్ కళ్యాణ్ను ట్రోల్ చేశారు. అయితే దీనిపై మంచు లక్ష్మీ స్పందించింది. మంచో చెడో ఏదో ఒకటి గానీ.. పవన్ కళ్యాణ్ గారి పక్కన నా ఫోటో పెట్టడం నాకు సంతోషంగా అనిపిస్తోందంటూ పవన్ కళ్యాణ్ మీదున్న ప్రేమను చెప్పకనే చెప్పేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం ఉందనే విషయం మనందరికి తెలిసిందే. గతంలో పలు సినిమాల్లో ప్రదర్శించారు కూడా. ఆ తర్వాత అన్నీ కమర్షియల్ సినిమాలే చేసుకుంటూ వచ్చిన పవన్.. మరోవైప రాజకీయాల్లోనూ బిజీ అయిపోవడం వలన మార్షల్ ఆర్ట్స్ జోలికి వెళ్లక చాలా కాలమైంది. కాని హరిహర వీరమల్లు కోసం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఇటీవల ఓ స్టిల్ను పోస్టు చేశాడు.దీనిపై మిక్స్ డ్ కామెంట్స్ వస్తున్నాయి. క్రిష్ డైరెక్షన్లో ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు పవన్ . ఆ తర్వాత సాహో దర్శకుడు సుజిత్తో ఒక గ్యాంగ్స్టర్ సినిమా అనౌన్స్ చేశాడు. ఇదేగాక తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న ‘ఉస్తాద్ భగత్సింగ్’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…