Suman : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా వాడి వేడిగా సాగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు ప్రత్యర్ధులపై దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో సుమన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సుమన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మూడు కాకపోతే ముప్పై పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. మాటిచ్చి తప్పే వ్యక్తులకి ఓటేయోద్దని ఆయన అన్నారు. రజనీకాంత్ని టార్గెట్ చేసి మాట్లాడడం కూడా బాధ కలిగించిందని అన్నారు. చిరంజీవి అన్న దాంట్లో తప్పేముంది.. సిన ఇండస్ట్రీకి, రాజకీయాలకి సంబంధం ఏముందని సుమన్ స్పష్టం చేశారు.
పవన్ పెళ్లి చేసుకున్న వారికి లేని బాధ వారికెందుకో అర్ధం కావడం లేదు.వచ్చే ఎన్నికలలో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలి. చంద్రబాబు చాలా విజన్ ఉన్న వ్యక్తి అని సుమన్ అన్నారు సినీ పరిశ్రమలోని వారు పకోడి గాళ్లు కాదు, అలా విమర్శించిన వారు బజ్జీగాళ్లు అని సుమన్ స్పష్టం చేశారు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది చంద్రబాబే అని ఆయన స్పష్టం చేశారు. ఆయన రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరైంది కాదని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని రజినీకాంత్ పై ఎందుకు బురదజల్లుతున్నారని ప్రశ్నించారు. మేమెన్ని కష్టాలు పడతామో మీకు తెలుసా అని ఆయన విమర్శించారు సుమన్.
గో మహాపాదయాత్రలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, ప్రజలందరి క్షేమం కోరి తాను ఈ కార్యక్ర మానికి సంఘీభావం తెలిపానని సుమన్ చెప్పారు.అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడైన బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ కలుషి తమైన ఈ భూమిని బాగుపరచాలంటే ఆవు మూత్రం, పేడ తప్పితే ప్రపంచంలో ఏ వస్తువూ ఉపయోగపడదన్నారు. గోవులు అన్ని మతాలు, కులాల వారికి అవసరమని పేర్కొన్నారు. అలిపిరి కాలినడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటా మని, ఆ తర్వాత శ్రీవారిమెట్టు ద్వారా కిందకు దిగి తమిళనాడు అరుణాచలానికి పయనమవుతామని అన్నారు. ఈనెల 31న గో మహాపాదయాత్రకు ముగింపు పులుకుతామని సుమన్ తెలిపారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…