బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం హై బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులని చవి చూస్తున్న డార్లింగ్ రానున్న రోజులలో వరుస హిట్స్తో అలరించబోతున్నట్టు సమాచారం. సలార్, ప్రాజెక్ట్ కె’ ఫిల్మ్స్ షూటింగ్స్లో ప్యార్లల్గా పాల్గొంటున్నాడు. ‘అర్జున్ రెడ్డి, కబీర్ ఖాన్, యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ తన 25వ పిక్చర్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్స్తోను ప్రభాస్ సినిమా చేయబోతున్నాడు.
ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకి సంబంధించిన వాళ్లని ఎంత చక్కగా చూసుకుంటారనేది అందరికి తెలిసిన విషయమే. గతంలో తనతో పని చేసిన టీంకి ఇంటి నుండి స్వయంగా తయారు చేయించిన ఫుడ్ తెప్పించి కడుపు నింపే వాడు. ఆ మధ్య ప్రాజెక్ట్ కె చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్న సమయంలో ప్రభాస్ పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, నాని, లతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రావు కూడా పాల్గొన్నారు. మళ్లీ ఇలాంటి ఫ్రేమ్ కుదరదని ఇలాంటి సందర్భం మళ్లీ రాదని భావించారో ఏమో గానీ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ రాఘవేంద్రరావు హీలు నాని దుల్కర్ సల్మాన్ దర్శకుడు నాగ్ అశ్విన్ ..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.
ఇక తాజాగా ప్రభాస్ టాప్ డైరెక్టర్స్ అందరికి కలిసి పార్టీ ఇచ్చినట్టుతెలుస్తుంది. తాజాగా ప్రభాస్ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశారని, ఆ పార్టీలో రాజమౌళి, క్రిష్, అనీల్ రావిపూడి, హరీష్ శంకర్, నాగ్ అశ్విన్, సందీప్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ టాప్ డైరెక్టర్స్ అంతా ప్రభాస్ ఇంట్లో నానా రచ్చ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన పిక్స్ స సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ పిక్ చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…