Srikanth : మెగాస్టార్ చిరంజీవి, చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన చిత్రం శంకర్దాదా ఎంబీబీఎస్. 2004లో విడుదలయిన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నవంబర్ 4న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ను గురువారం సాయంత్రం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
2004 నాకెంతో ప్రత్యేరం. ఆ సంవత్సరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నటుడిగా ఇండస్ర్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్నయ్య చిరంజీవితో కలిసి నటించాలని ఎన్నో కలలు కనేవాడిని. ‘మున్నాభాయ్’ చిత్రాన్ని తెలుగులో అన్నయ్యతో రీమేక్ చేస్తున్నారని తెలిసినప్పుడు డైరెక్ట్ ఆయనకే ఫోన చేశా. మాతృకలో చూపించినట్లుగా హీరో పక్కన ఉండే కమెడీయన పాత్రకు ఎవరిని ఎంచుకున్నారని అడిగాను. అంతే కాదు ఆ పాత్ర నేను చేస్తే ఎలా ఉంటుంది అన్నయ్యా అని కూడా అడిగేశా. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. కట్ చేేస్త.. మరుసటి రోజు జెమిని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏటీఎం పాత్ర కోసం నన్ను ఎంచుకున్నట్లు చెప్పారు. ఆ మాట వినగానే ఎంతో సంతోషించా. అన్నయ్యతో కలిసి నటించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందా. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఇది. రీ రిలీజ్లోనూ ఇది పెద్ద సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా అని శ్రీకాంత్ చెప్పారు.
ఇక ఈ చిత్రం రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని నాగబాబు అన్నారు. ‘ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతుంటుంది. టీవీ, యూట్యూబ్లో పాత సినిమాలను చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు థియేటర్లో రిపీటెడ్ రన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఓటీటీ, చానెళ్లకు సినిమాలు వెళ్లిపోతున్నాయి. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే ఎక్స్పీరియెన్స్ చేయాలి. మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. అప్పుడు అన్నయ్య గారు ఎంతో అందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదో అలా వస్తే చిన్న సీన్ చేయించారు. వైష్ణవ్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. నా ఫ్రెండ్ ఆహుతి ప్రసాద్ ఇప్పుడు లేరు. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి అని నాగబాబు పేర్కొన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…