Sri Reddy : టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల ప్రేక్షకులకు శ్రీరెడ్డి చాలా సుపరిచితం.పెద్దగా సినిమాలు చేయకపోయిన కూడా వివాదాలు, వివాదాస్పద అంశాల ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో నిలిచారు. గత నాలుగేళ్లుగా బాగా పాపులర్ అవుతూ వస్తుంది. నిజంగా ఆమెకు పాపులారిటీ మంచిగా వచ్చినా… చెడుగా వచ్చిన ఈ క్రేజ్ వ్యక్తిగతంగా సంపాదించుకున్నదే. శ్రీ రెడ్డి బూతులు మాట్లాడటం.. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ రేపుతూ ఉండటం.. ఎవరో ఒకరిని తిడుతూ ఉండటం కామన్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో పాటు వైసీపీ వ్యతిరేఖులపై ఎప్పుడు దారుణమైన విమర్శలు చేస్తూ ఉంటుంది.
వైసీపీని కూడా వచ్చే ఎన్నికలలో గెలిపించాలని శ్రీరెడ్డి కంకణం కట్టుకుంది. వీలున్నప్పుడల్లా ఫ్రీగా ప్రచారం చేస్తుంది. అయితే అధికార వైసీపీలో ఉంటూనే ప్రతిపక్షానికి కొమ్ముకాస్తున్న నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఇటీవల సస్పెండ్ చేసిన విషయం విదితమే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలను విషపరుగులతో పోల్చుతూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. మీ ఆశయాల మీద నమ్మకంతో మీరేమి ఇవ్వకున్నా.. మీ మీద ప్రేమతో మీతోనే నడిచేవాళ్లం మేమంతా.
విష పురుగులు విషమే తప్ప అమృతాన్ని కురిపిస్తాయా జగన్ అన్నా.. పదవి, కోట్లు ఇవ్వకున్నా మిమ్మల్ని నమ్మి కోట్ల మంది ఉన్నారు. చంద్రబాబుని నమ్మి విషపురుగులు మాత్రమే ఉంటాయి.. జై జగన్’ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. మరి ఇప్పుడు ఈమె పోస్ట్ తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. పైకి ఏమి ఆశించడం లేదు అంటున్నా కూడా లోలోపల మాత్రం శ్రీరెడ్డి వైసీపీ నుండి సమ్ థింగ్ ఆశిస్తుందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇటీవల శ్రీరెడ్డి వంటకాలకి సంబంధించిన వీడియోలతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…