Anasuya : ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మంచి సినిమాలకి తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ మధ్య బలగం చిత్ర బృందాన్ని అభినందించిన చిరు తాజాగా రంగమార్తాండ మూవీపై ఆసక్తికర ట్వీట్ చేశారు. చిత్రంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం నటన ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. ఇలాంటి చిత్రాలను అందరూ చూసి ఆదరించాలని కోరారు. రంగమార్తాండ సినిమా చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి చిత్రాల్లో ఇదీ ఒకటి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్నట్టు అనిపిస్తుంది.
ఈచిత్రం ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్.. ప్రకాశ్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు.. హాస్యబ్రహ్మానందం కలయిక.. వారి పనితనం.. ఆ ఇద్దరి అద్భుతమైన నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది’’ అని పేర్కొన్నారు. ‘‘బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్రను చేయడం ఇదే తొలిసారి. సెకండ్ హాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంట తడి పెట్టించింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించాలి. రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు’’ అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
అయితే చిరంజీవి ట్వీట్కి అనసూయ స్పందిస్తూ.. థ్యాంక్యూ చిరు సర్ అని కామెంట్ పెట్టింది. అయితే ఎప్పుడు అనసూయ దొరుకుతుందా ఆమెని ట్రోల్ చేయాలని చూస్తూ ఉండే ఓ వర్గం తాజా ట్వీట్పై కూడా స్పందించింది. ‘నిన్ను ట్యాగ్ చేయలేదు కదా ఆంటీ.. నీ ప్రస్తావన ఎక్కడా తీసుకుని రాలేదు.. ఈ షుగర్ ఎందుకు’ అంటూ అనసూయపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అయితే అనసూయ సపోర్టర్స్ మాత్రం చిత్ర బృందం అని మెన్షన్ చేశారు కదా, ఆమె కూడా చిత్రంలో అద్భుతంగా నటించింది కదా అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…