Sonia Gandhi : ఈ రోజు తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు 11 మంది మంత్రులు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఇక రేవంత్ రెడ్డి ముందుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ప్రగతి భవన్ ఇకపై ప్రజాభవన్గా మారబోతోందని.. అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అన్నారు. ఆరు గ్యారంటీల విషయంలోనూ మాట నిలుపుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిందన్నారు.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయని పేర్కొన్న రేవంత్.. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందన్నారు. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో, తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుందన్నారు. పేదల ముఖాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయని, హక్కుల రెక్కలు విచ్చుకుంటాయన్నారు. త్వరలోనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే.. రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి సోనియా ఆశీర్వాదం తీసుకున్నారు. సోనియగాంధీ కాళ్లు మొక్కారు రేవంత్ దంపతులు.
రేవంత్ తన కూతురు అల్లుడిని కూడా పిలిచారు. వారిని సోనియా,రాహుల్లకి పరిచయం చేశారు. అయితే సోనియా వేదికపైకి వచ్చినప్పుడు రేవంత్ మనవడిని ముద్దాడింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా బాబు క్యూట్గా ఉన్నాడంటూ కామెంట్ చేసి ఆశీస్సులు అందించారు. ప్రస్తుతం ఈ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటూ.. మరో 11 మంది కూడా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోద రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…