టీ 20 వరల్డ్ కప్లో భారత ప్రదర్శనపై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ల ప్రదర్శన అంతగా ఏమి లేదు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించారు. ఇక నెదర్లాండ్స్ మ్యాచ్లో అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే కనబరచలేదు. దీంతో ఇండియా సెమీస్ దాటి ఫైనల్కి వెళుతుందా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. సెమీస్కి ఇండియా వెళ్లడం పెద్ద కష్టం ఏమి కాదు. సెమీ ఫైనల్ చేరినా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా అంతకుమించి ముందుకు వెళ్లదని కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.
పాకిస్తాన్ టీమ్ బాలేదు, వాళ్ల ఆట తీరు కూడా ఏమంత బాలేదు. ఐసీసీ టోర్నీలకు యావరేజ్ టీమ్ని సెలక్ట్ చేసి, యావరేజ్ ఆట ఆడిస్తే… ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. సూపర్ 12 రౌండ్ నుంచి పాక్ ఇంటిదారి పడుతుందని ముందుగానే ఊహించా. ఇక టీమిండియా మరో వారం ఆడుతుందంతే. వాళ్లు కూడా సెమీ ఫైనల్లో ఒడిపోయి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్లేం తీస్ మార్ ఖాన్లు కాదు. పాకిస్తాన్ టీమ్ ఎలాగైతే యావరేజ్గా ఉందో టీమిండియా కూడా అంతే. అయితే మన టీమ్, వాళ్ల కంటే చెత్తగా ఉంది అంతే.. ఐసీసీ టోర్నీలు గెలవాలంటే కావాల్సిన రేంజ్ ఇరు జట్ల దగ్గరా లేదు అని షోయబ్ అన్నాడు.
పాక్కి ఓ చెత్త కెప్టెన్ దొరికాడు. ఈ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో మీరు మ్యాచులేం గెలుస్తారు. షాహీన్ ఆఫ్రిదీ ఫిట్గా ఉన్నాడా? అతను ఫిట్గా లేకపోయినా ఆడించాలని ఆడిస్తున్నారా? మన ఓపెనర్లకు 30 యార్డ్ సర్కిల్ని ఎలా వాడుకోవాలో కూడా తెలీదు. ఫకార్ జమాన్ లాంటి బ్యాక్ ఫుట్ బ్యాటర్, ఆస్ట్రేలియాలో బాగా ఆడగలడు. ఓ ప్లాన్ లేదు, ఓ మిడిల్ ఆర్డర్ లేదు… సరైన ఓపెనర్లు లేరు…’ అంటూ నిప్పులు చెరిగాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. ఇండియా, జింబాబ్వే చేతిలో ఓటమి తరువాత పాక్ సెమీస్ భవితవ్యం ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్థాన్ ఇకపై ఆడే అన్ని మ్యాచ్లు మంచి నెట్ రన్రేట్తో గెలవాలి. ఇండియా అన్ని మ్యాచ్లు గెలవడంతో పాటు.. సౌతాఫ్రికా, జింబాబ్వే రెండు మ్యాచ్లు ఓడిపోవాలి. ఇలా జరిగితే పాక్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యమే అని చెప్పాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…