Shaakuntalam Jewelry : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ మధ్య వరుస సినిమాలతో తెగ సందడి చేస్తున్న సమంత యశోద తర్వాత శాకుంతలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సోషియో ఫాంటసీగా తెరకెక్కించారు గుణశేఖర్. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం కాగా, విజువల్ వండర్తో పాన్ ఇండియా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయటానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుష్యంతుడి రాజమహల్లో దేవతలు, రాజుల పాత్రలకు భారీగా నగలు వాడాల్సి ఉండగా, ఈ చిత్రం కోసం వాడిన నగల విలువ తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఈ సినిమాలో కేజీలకు కేజీల బంగారు అభరణాలు వాడినట్టుగుణశేఖర్ తెలిపారు. వాటి విలువ సుమారు రూ.14కోట్లు ఉంటుందన్నారు. ఈ చిత్రంలో జ్యూవెల్లరి ఎలా అనుకున్నప్పుడు నీలిమా సుంధర జ్యూవెల్లరీ వారితో మాట్లాడి డీల్ కుదుర్చుకున్నారట. వాళ్లు ఆరేడు నెలల పాటు దీనిపై కూర్చొని దాదాపు 14 కేజీల బంగారం వాడి శకుంతల ఆభరణాలు డిజైన్ చేశారని గుణశేఖర్ పేర్కొన్నాడు.
చిత్రంలో అన్నీ కూడా నిజమైన బంగారం, వజ్రాలను వాడినట్టు చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన `దానవీర శూర కర్ణ` చిత్రంలో వాళ్లు ధరించిన నిజమైన బంగారు ఆభరణాలు, కిరీటాలను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా నిజమైన బంగారం వాడామని స్పష్టం చేశారురు. అయితే ఇంతటి బంగారు ఆభరణాలను మేం తయారు చేయించాలంటే ఏకంగా ఓ పెద్ద జ్యూవెల్లరి షాపే పెట్టుకోవచ్చని, దిల్రాజుగారికి చెబితే ఇదే మాట అనేవారని, ఆయనకు వసుంధర వాళ్లు ఇలా టై అప్ అయ్యారని , దీంతో మేం రిలీఫ్ అయ్యామని గుణశేఖర్ స్పష్టం చేశారు. వసుంధర, ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా, నేహ వంటి వారు పలు డిజైన్స్ చేశారని, శకుంతల పాత్రకి 15కేజీల బంగారంతో 14 రకాల ఆభరణాలు చేశారని అన్నాడు. అలాగే దుష్యంతుడి పాత్ర కోసం దాదాపు పది కేజీల బంగారు ఆభరణాలు, మేనక పాత్ర ధారి అయిన మధుబాల కోసం ఆరు కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను, బంగారు ఆభరణాలను తయారు చేయించామని చెప్పుకొచ్చారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…