Roja : గత కొద్ది రోజులుగా ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర కొనసాగించగా, దీనిపై వైసీపీ నాయకులు అనేక విమర్శలు గుప్పించారు. తాజాగా మంత్రి రోజా పవన్, నారా లోకేష్, చంద్రబాబులపై సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఏపీ ప్రజలు హాయ్ ఏపీ.. బై బై బీపీ (బాబు, పవన్ ).. వన్స్ ఎగైన్ వైఎస్ఆర్ సీపీ అంటున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇరిటేషన్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబు, ఇన్స్పిరేషన్ స్టార్ జగనన్న కాలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరు అంటూ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్లీ జగన్ ను సీఎం చేయాలన్న కసితో ఉన్నారని, ఎంతమంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా లాభం లేదని రోజా కామెంట్ చేసింది.పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాలేరని జోస్యం చెప్పారు. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కళ్యాణ్కూ ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34 మంది అభ్యర్థులను పవన్ కళ్యాణ్ సొంతంగా నిలబెట్టాలని మంత్రి రోజా సవాల్ విసిరారు.ఇక నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేగా గెలవాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు సొంత జిల్లా చిత్తూరుకు చేసిందేమీ లేదని మంత్రి విమర్శలు గుప్పించారు.
రికార్డులు సృష్టించాలి అన్నా.. ఆయన రికార్డులను బ్రేక్ చేయాలన్న ఆయన తప్ప వేరే ఎవరూ బ్రేక్ చెయ్య లేరని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇచ్చిన మాట కోసం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు డెయిరీని ప్రారంభిస్తున్నారని మంత్రి రోజా స్పష్టం చేశారు. పప్పు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియడం లేదని రోజా.. నారా లోకేష్ పై పంచ్లు విసిరింది. ఏది ఏమైన కొన్నాళ్లుగా ఒక పార్టీ నేతలు మరొక పార్టీపై దారుణమైన కామెంట్స్ చేస్తూ రాజకీయాలలో మరింత వేడి పుట్టిస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…